AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణం తీసిన క్షణికావేశం.. నిద్ర పోనివ్వలేదని సొంత అన్ననే కాటికి పంపిన తమ్ముడు..!

మధ్యప్రదేశ్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. నిద్రకు భంగం కలిగిందన్న చిన్న కారణంతో ఓ తమ్ముడు తన సొంత అన్ననే కిరాతకంగా హతమార్చిన ఈ ఘటన రేవా జిల్లా గూఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దువా గ్రామంలో కలకలం రేపింది.

ప్రాణం తీసిన క్షణికావేశం..  నిద్ర పోనివ్వలేదని సొంత అన్ననే కాటికి పంపిన తమ్ముడు..!
Rewa District Crime
Balaraju Goud
|

Updated on: May 12, 2026 | 7:58 PM

Share

మధ్యప్రదేశ్‌లో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. నిద్రకు భంగం కలిగిందన్న చిన్న కారణంతో ఓ తమ్ముడు తన సొంత అన్ననే కిరాతకంగా హతమార్చిన ఈ ఘటన రేవా జిల్లా గూఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్దువా గ్రామంలో కలకలం రేపింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్దువా గ్రామానికి చెందిన జితేంద్ర కోల్ (23) తన ఇంట్లో గాఢ నిద్రలో ఉన్నాడు. అదే సమయంలో అతని అన్న ధర్మేంద్ర కోల్ (28) అక్కడికి వచ్చి, ఏదో విషయంలో జితేంద్ర నిద్రకు భంగం కలిగించాడు. పగలంతా కష్టపడి వచ్చి నిద్రిస్తున్న తనకు అంతరాయం కలగడంతో జితేంద్ర తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు.

నిద్రలో నుంచి లేచిన జితేంద్ర తన అన్న ధర్మేంద్రతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరిగి వాగ్వాదం ముదిరింది. కోపంతో ఊగిపోయిన జితేంద్ర, విచక్షణ కోల్పోయి పక్కనే ఉన్న పదునైన కత్తిని తీసుకున్నాడు. క్షణికావేశంలో అన్న అని కూడా చూడకుండా ధర్మేంద్ర కంటిలో బలంగా పొడిచాడు. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో ధర్మేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సినిమా కథను తలపించేలా జరిగిన ఈ వాస్తవ సంఘటనతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

హత్య జరిగిన వెంటనే నిందితుడు జితేంద్ర కోల్ చీకటిని ఆసరాగా చేసుకుని గ్రామం నుండి పారిపోయాడు. సమాచారం అందుకున్న గూఢ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ శైల్ యాదవ్ తన బృందంతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రస్తుతం నిందితుడు జితేంద్ర కోల్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అతను దాక్కున్నట్లు అనుమానిస్తున్న ప్రాంతాలపై దాడులు నిర్వహిస్తున్నారు. రక్త సంబంధాల మధ్య పెరిగిన విద్వేషం ఇంతటి ఘోరానికి దారితీయడం బాధాకరం అని గ్రామస్థులు వాపోతున్నారు. ఈ ఘటనతో హర్దువా గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నపాటి ఆవేశం ఒకరి ప్రాణాన్ని తీయడమే కాకుండా, మరొకరిని జైలు పాలు చేసింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us