Lok Sabha Election 2024: రెండో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ప్రచార పర్వానికి నేటితో ముగింపు

లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం రెండో దశ ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేటి సాయంత్రం నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీని తర్వాత ఏప్రిల్ 26న 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సీట్ల ఫలితాలు కూడా జూన్ 4న ఏకకాలంలో వెలువడనున్నాయి. ఓటింగ్ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

Lok Sabha Election 2024: రెండో దశ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ప్రచార పర్వానికి నేటితో ముగింపు
Voting Arrangements

Updated on: Apr 24, 2024 | 8:04 AM

లోక్‌సభ ఎన్నికలు 2024 కోసం రెండో దశ ఓటింగ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. నేటి సాయంత్రం నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీని తర్వాత ఏప్రిల్ 26న 13 రాష్ట్రాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ సీట్ల ఫలితాలు కూడా జూన్ 4న ఏకకాలంలో వెలువడనున్నాయి. ఓటింగ్ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.

మరోవైపు మూడో విడత ఓటింగ్‌కు నామినేషన్ల ఉపసంహరణ తేదీ ముగియడంతో మొత్తం అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. మూడో దశలో మే 7న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 95 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

95 స్థానాల్లో 1351 మంది అభ్యర్థులు పోటీ

మూడో దశలో 95 నియోజకవర్గ స్థానాలకు మొత్తం 1,351 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మూడో విడత ఓటింగ్ కోసం మొత్తం 2,963 నామినేషన్ ఫారాలు సమర్పించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. వారి విచారణ తర్వాత 1,563 ఆర్మ్స్ మాత్రమే సరైనవని తేలింది. వీరిలో 212 మంది తమ పేర్లను ఉపసంహరించుకోగా, 1,351 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు.

రెండో దశలో ఏ రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో ఓటింగ్‌

రాష్ట్రం లోక్‌సభ స్థానాల సంఖ్య
అస్సాం 05
బీహార్ 05
ఛత్తీస్‌గఢ్ 03
జమ్మూ కాశ్మీర్ 01
కర్ణాటక 14
కేరళ 20
మధ్యప్రదేశ్ 06
మహారాష్ట్ర 08
రాజస్థాన్ 13
త్రిపుర 01
ఉత్తర ప్రదేశ్ 08
పశ్చిమ బెంగాల్ 03

రెండో దశలో ఏ రాష్ట్రంలోని ఏయే స్థానాల్లో పోలింగ్

 

త్రిపుర: త్రిపుర తూర్పు

జమ్మూ కాశ్మీర్: జమ్మూ లోక్‌సభ

పశ్చిమ బెంగాల్: డార్జిలింగ్, రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్

అస్సాం: దర్రాంగ్-ఉదల్గురి, డిఫు, కరీంగంజ్, సిల్చార్, నాగావ్

బీహార్: కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా, భాగల్పూర్, బంకా

ఛత్తీస్‌గఢ్: రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కంకేర్

మధ్యప్రదేశ్: తికమ్‌గఢ్, దామోహ్, ఖజురహో, సత్నా, రేవా, హోషంగాబాద్

మహారాష్ట్ర: బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని.

ఉత్తరప్రదేశ్: అమ్రోహా, మీరట్, బాగ్‌పట్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీఘర్, మధుర.

రాజస్థాన్: టోంక్-సవాయి మాధోపూర్, అజ్మీర్, పాలి, జోధ్‌పూర్, బార్మర్, జలోర్, ఉదయపూర్, బన్స్వారా, చిత్తోర్‌ఘర్, రాజ్‌సమంద్, భిల్వారా, కోట, ఝలావర్-బారా.

కర్ణాటక: ఉడిపి-చిక్‌మగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మాండ్య, మైసూర్, చామరాజనగర్, బెంగళూరు రూరల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సెంట్రల్, బెంగళూరు సౌత్, చిక్కబల్లాపూర్, కోలార్.

కేరళ: కాసరగోడ్, కన్నూర్, వడకర, వాయనాడ్, కోజికోడ్, మలప్పురం, పొన్నాని, పాలక్కాడ్, అలత్తూర్, త్రిస్సూర్, చాలకుడి, ఎర్నాకులం, ఇడుక్కి, కొట్టాయం, అలప్పుజ, మావేలిక్కర, పతనంతిట్ట, కొల్లం, అట్టింగల్, తిరువనంతపురం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Loading...
Unable to load recommendations.
Follow Us