
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఒక విడత కరువు భత్యం మంజూరు చేసింది. సర్వీస్ పెన్షనర్లకు ఒక విడత కరువు ఉపశమనం కూడా ఆమోదించినట్లు ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ ప్రకటించారు. UGC, AICTE, మెడికల్ సర్వీసెస్ కింద ఉన్నవారు కూడా లబ్ధిదారులలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెరిగిన DA (డియర్నెస్ అలవెన్స్), DR (డియర్నెస్ రిలీఫ్) ప్రయోజనాన్ని పొందుతారు.
కొత్త ప్రయోజనాలను సెప్టెంబర్ నెల జీతం, పెన్షన్తో పాటు పంపిణీ చేస్తారు. డీఏ మంజూరుతో, రాష్ట్ర వార్షిక వ్యయం సుమారు రూ.2,000 కోట్లు పెరుగుతుందని అంచనా. ఈ సంవత్సరం మంజూరు చేయబడిన డీఏ, డీఆర్ రెండవ విడత ఇది. గత సంవత్సరం కూడా రెండు విడతలు మంజూరు చేశారు. కేరళ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి