ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఒంటరైన పాకిస్తాన్కు సాయం చేస్తారనుకున్న దేశాలన్ని రిక్త హస్తాలు చూపడంతో ఏంచేయాలో అర్ధంకాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. అయితే తనకు ఎవరైనా మద్దతు పలకకపోతారా.. అనే ప్రయత్నం మాత్రం మానలేదు. ఈ నేపథ్యంలో జమ్ము- కశ్మీర్ విషయంలో చర్చించేందుకు ఐక్యారాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన చైనా ఒత్తిడితో ఐరాస భద్రతా మండలి క్లోజ్డ్ కన్సల్టేషన్స్ నిర్వహించనున్నట్టుగా సమాచారం. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడు జోఅనా రోనెకాను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం ప్రకారం ఈ నెల 16న (శుక్రవారం) జమ్మూ-కశ్మీరుపై క్లోజ్డ్ డోర్స్లో చర్చించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి.