AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జులై 1నుంచి ఉచిత విద్యుత్‌.. ఇచ్చిన హామీలు అమల్లోకి తెస్తున్న కాంగ్రెస్‌

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌ను అందించే గృహజ్యోతి అమలుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. జూలై 1, శనివారం అర్ధరాత్రి నుంచి వినియోగించే విద్యుత్ గృహజ్యోతి పథకం కింద వర్తిస్తుంది. నేటి అర్ధరాత్రి నుంచి జులై 31 వరకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు.

జులై 1నుంచి ఉచిత విద్యుత్‌.. ఇచ్చిన హామీలు అమల్లోకి తెస్తున్న కాంగ్రెస్‌
Congress Flag
Jyothi Gadda
|

Updated on: Jun 30, 2023 | 8:17 PM

Share

రాష్ట్ర ప్రజలకు 5 ప్రధాన హామీల అమలుకు భరోసానిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలై 1 నుంచి మరో రెండు హామీ పథకాలను అమలు చేస్తోంది. జూలై 1 నుంచి మరో రెండు ప్రాజెక్టులు అమలు కానున్నాయి. దీనికి కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించే గృహ జ్యోతి పథకం ఈరోజు అర్ధరాత్రి నుంచి అమలు కానుంది. జులై 1 మధ్యాహ్నం విధాన్‌సౌధలో అన్నభాగ్య పథకాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ శక్తి పథకం అమలులోకి వచ్చింది.

ఉచిత కరెంటు ఎవరికి వస్తుంది? :

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్‌ను అందించే గృహజ్యోతి అమలుకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. జూలై 1, శనివారం అర్ధరాత్రి నుంచి వినియోగించే విద్యుత్ గృహజ్యోతి పథకం కింద వర్తిస్తుంది. నేటి అర్ధరాత్రి నుంచి జులై 31 వరకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. ఇప్పటికే జూన్ 18 నుంచి గృహజ్యోతి కోసం దరఖాస్తులు ఆహ్వానించగా లక్షలాది మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నారు. ఇప్పటివరకు గృహజ్యోతి యోజనకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హులు.

అన్నభాగ్య యోజన అమలు:

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జూన్ 1న అన్నభాగ్య యోజన (10 కిలోల బియ్యం పంపిణీ) అమలు చేయనున్నారు. ఈ పథకం కింద రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ జూలై నెలలో 5 కిలోల బియ్యం అందుతాయి. మిగిలిన 5 కిలోలు ఒక్కొ కిలో రూ.34 కాగా 170 రూపాయల నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయి. అయితే 6 లక్షలకుపైగా రేషన్ కుటుంబాలకు బ్యాంకు ఖాతా లేకపోవడంతో వారికి నిధులు ఎలా ఇవ్వాలో తెలియక ప్రభుత్వం అయోమయంలో పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..