మరో ఘనత సాధించిన ఇస్రో.. పేటెంట్ హక్కు సొంతం

| Edited By:

May 21, 2020 | 8:00 AM

ఇస్రో మరో ఘనత సాధించింది. చంద్రుడిపై ఉండే మాదిరి మట్టిని తయారు చేసి అబ్బురపరిచింది. ఈ ఆవిష్కరణకు గాను పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది ఇస్రో. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు..

మరో ఘనత సాధించిన ఇస్రో.. పేటెంట్ హక్కు సొంతం
Follow us on

ఇస్రో మరో ఘనత సాధించింది. చంద్రుడిపై ఉండే మాదిరి మట్టిని తయారు చేసి అబ్బురపరిచింది. ఈ ఆవిష్కరణకు గాను పేటెంట్ హక్కులను సొంతం చేసుకుంది ఇస్రో. చంద్రమృత్తికను కృత్రిమంగా తయారు చేసే విధానాన్ని కనుగొన్నందుకు ఇండియన్ పేటెంట్ ఆఫీస్ ఇస్రోకు పెటెంట్‌ను మంజూరు చేసింది. ఈ పేటెంట్ హక్కులు ఇస్రో దరఖాస్తు చేసిన నాటి నుంచి మరో ఇరవై సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ ఆవిష్కరణలో ఇస్రోకు చెందిన ఐ వేణుగోపాల్, ఎస్‌ఏ కన్నన్, వి చంద్రబాబులతో పాటు పెరియార్ యూనివర్శిటీకి చెందిన ఎస్ అంబజగన్, ఎస్ అరివళగన్, సీఆర్ పరమశివం, ఎం చిన్నముత్తు ఉన్నారు. వారితో పాటు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరాపల్లికి చెందిన కే ముత్తుకుమరన్ తదితరులు భాగస్వాములయ్యారు.

ఈ మట్టి ఎందుకంటే.. భారత్ గతంలో తలపెట్టిన చంద్రయాన్‌లో విక్రమ్ మూన్ లాండర్.. చంద్రుడిపై దిగే సమయంలో విఫలమైంది. అయినా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ మరో ప్రయత్నం చేస్తోంది. అదే చంద్రయాన్-2. ఈ ప్రయోగాల్లో భాగంగా విక్రమ్ లాండర్, ప్రజ్ఞాన్ రోవర్ మొదలైన వాటిని పరీక్షించేందుకు ఇస్రోకు చంద్రుని మీది ఉంటే వాతావరణాన్ని కృత్రిమంగా తయారు చేయాల్సి వచ్చింది. కాగా భవిష్యత్తులో కూడా తలపెట్టనున్న అనేక అంతరిక్ష ప్రయోగాలకు ఇది చాలా అవసరమౌతుంది.

అయితే మొదట ఈ చంద్రమృత్తికను అమెరికా నుంచి దిగుమతి చేసుకుందామనుకున్నారట. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం కావడంతో.. దేశీయంగానే చంద్రుడి మీద ఉండే మట్టిని తయారు చేశారు భారత శాస్త్రవేత్తలు.

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి