శ్మశానంలో ప్రేమ పెళ్లి.. ముక్కున వేలేసుకున్న ఊరి జనాలు!

|

Jul 27, 2023 | 7:13 AM

ఓ తండ్రి శ్మశానంలో కూతురికి ఘనంగా ప్రేమ పెళ్లి జరిపించాడు. సంప్రదాయబద్ధంగా వీరికి వివాహం జరిపించి ఆశీర్వదించాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది..

శ్మశానంలో ప్రేమ పెళ్లి.. ముక్కున వేలేసుకున్న ఊరి జనాలు!
Marriage
Follow us on

ముంబాయ్‌, జులై 27: ఓ తండ్రి శ్మశానంలో కూతురికి ఘనంగా ప్రేమ పెళ్లి జరిపించాడు. సంప్రదాయబద్ధంగా వీరికి వివాహం జరిపించి ఆశీర్వదించాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన జోగి గంగాధర్‌ గైక్వాడ్‌, గంగూబాయ్‌ గైక్వాడ్‌ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. గంగాధర్‌ స్థానిక శ్మశానవాటికలో కాటికాపరిగా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహాసంజోగి వర్గానికి చెందిన గంగాధర్ చాలా ఏళ్లుగా కుటుంబంతో కలిసి శ్మశానంలోనే నివాసం ఉంటున్నాడు. వీరి చిన్న కుమార్తె మయూరి షిర్డీకి చెందిన మనోజ్‌ జైస్వాల్‌ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరిద్దరి కులాలు వేరువేరు అయినా పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలిపారు.

Marriage At Crematorium

దీంతో మయూరి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేయాలని గంగాధర్‌ భావించాడు. ఆ మేరకు బంధుమిత్రులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ జంట పెళ్లి తంతు ముగించారు. విభిన్నమైన వీరి పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.