దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవం.. యావత్ భారతావనికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవం.. యావత్ భారతావనికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

Edited By: Ravi Kiran

Updated on: Jan 26, 2021 | 8:34 AM

Indian republic day 2021: 72వ గణతంత్ర దినోత్సవంతో భారతావని పులకించిపోతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మంగళవారం ఉదయం ‘జైహింద్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలను పలకరిస్తూ అభినందనలు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి మధ్య నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథి లేకుండా తక్కువ మందితో కవాతు సాగింది. కొవిడ్ ప్రోటోకాల్ మధ్య రిపబ్లిక్ డే ఉత్సవాల్లో రాఫెల్ ఫైటర్ జెట్ లు, టి-90 ట్యాంకులు, సామ్ విజయ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్, సుఖోయ్-30 విమానాలు, ఎంకేఐ ఫైటర్ జెట్ లు విన్యాసాలు సాగించేందుకు సిద్ధమయ్యాయి. ఈమేరకు ప్రధాని మోదీ హిందీలో ట్వీట్ చేశారు.

Read Also… సభ్య సమాజానికి సాయం చేద్దాం.. దేశ ప్రగతిలో భాగస్వాములవుదాం.. భావితరాలకు బాసటగా నిలుద్దాం..