Narendra Modi: ఇది భారత ప్రజల సమిష్టి విజయం.. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై ప్రధాని మోదీ ట్వీట్‌..

Narendra Modi: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) వాలాదేవీలు గతంలో ఎన్నడూ లేని విధంగా 600 కోట్లకుపైగా జరగడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది భారత ప్రజల సమిష్టి విజయమని ఆయన అభివర్ణించారు...

Narendra Modi: ఇది భారత ప్రజల సమిష్టి విజయం.. యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై ప్రధాని మోదీ ట్వీట్‌..
Follow us

|

Updated on: Aug 02, 2022 | 7:21 PM

Narendra Modi: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) వాలాదేవీలు గతంలో ఎన్నడూ లేని విధంగా 600 కోట్లకుపైగా జరగడంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఇది భారత ప్రజల సమిష్టి విజయమని ఆయన అభివర్ణించారు. యూపీఐ సేవలు మొదలైన తర్వాత అత్యధిక లావాదేవీలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రధాని మంగళవారం ట్విట్టర్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

యూపీఐ పేమెంట్స్‌ విషయమై మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘ఇది ఒక అద్భుతమైన విజయం. కొత్త టెక్నాలజీని స్వీకరించడడంతో పాటు, భారత ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా మార్చడానికి భారత ప్రజలు చేసిన సమిష్టి కృషికి నిదర్శనం. కోవిడ్‌-19 విజృంభించిన సమయంలో డిజిటల్‌ చెల్లింపులు ఎంతగానే ఉపయోగపడ్డాయి’ అని మోదీ పేర్కొన్నారు.. రికార్డు స్థాయిలో డిజిటల్ చెల్లింపులు జరగడంపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్‌ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసిన ప్రధాని పై విధంగా స్పందించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే జూలై నెలలో ఏకంగా 600 కోట్లకుపైగా యూపీఐ పేమెంట్స్‌ జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 628 కోట్లు ఉండగా, వాటి విలువ రూ. 10.62 లక్షల కోట్లు. కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో డిజిటల్‌ చెల్లింపులు అత్యంత వేగంగా పెరిగాయని, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టి, ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయని ఎన్‌పీసీఐ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?