Watch Video: హై స్పీడ్‌లో దూసుకెళ్తున్న ట్రైన్‌.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్‌.. ఎందుకంటే?

చత్‌ పూజలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది సూర్య దేవుడు, ఛత్ మాత (షష్ఠీ దేవి)ని ఆరాధించే పండుగ. అయితే ఈ పూజల సందర్భంగా బీహార్ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఛత్ ప్రసాదం కోసం ఒక లోకో పైలట్‌ ఏకంగా ప్యాసింజర్ రైలును ఆపాడు. ఒక వ్యక్తి నుంచి ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ట్రైన్‌ను ముందు కదిలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఆమారింది

Watch Video: హై స్పీడ్‌లో దూసుకెళ్తున్న ట్రైన్‌.. సడెన్‌గా ఆపేసిన లోకో పైలట్‌.. ఎందుకంటే?
Viral Video

Updated on: Oct 30, 2025 | 10:27 PM

చత్‌ పూజలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే ఒక ముఖ్యమైన హిందూ పండుగ. ఇది సూర్య దేవుడు, ఛత్ మాత (షష్ఠీ దేవి)ని ఆరాధించే పండుగ. అయితే ఈ పూజల సందర్భంగా బీహార్ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఛత్ ప్రసాదం కోసం ఒక లోకో పైలట్‌ ఏకంగా ప్యాసింజర్ రైలును ఆపాడు. ఒక వ్యక్తి నుంచి ఆ ప్రసాదాన్ని తీసుకున్న తర్వాత ట్రైన్‌ను ముందు కదిలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఆమారింది.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చత్‌ పూజలు జరుగుతున్నాయి. పూజలు పూర్తి చేసిన భక్తులు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అదే క్రమంలో ఆ ప్రాంతంలోని రైలు పట్టాలపై నుంచి ఒక ప్యాసింజర్‌ ట్రైన్ వెళ్తుంది. అ ట్రైన్ నడుపుతున్న లోకోపైలెట్‌.. పట్టాల పక్కనే భక్తులు ప్రసాదం పంపిణీ చేయడాన్ని గమనించాడు. వెంటనే ట్రైన్‌ ఆపేసి అక్కడున్న వ్యక్తులను ప్రసాదం ఇవ్వాలని కోరాడు.. దీంతో ఒక వ్యక్తి వచ్చి ఆయనకు ప్రసాదం అందజేశాడు.

అయితే అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన జనాలు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.ఇదే నిజమైన సనాతన ధర్మమని ఒకరు కామెంట్ చేయగా.. అయితే భారత్‌ దేశంలో మాత్రమే ఇలాంటివి భక్తి కలిగిన వారు ఉంటారని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

వీడియో చూడండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..