
దేశంలో వైరల్ భయం మరింత పెరుగుతోంది. కొత్త కొత్త వైరల్లు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు బర్డ్ ఫ్లూ వంటి వైరల్లు భయాందోళనకు గురిస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని చింద్వారాలో పెంపుడు జంతువులలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ (H5N1) అంటే బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. భారతదేశంలో ఇలాంటి కేసు ఇదే తొలిసారి. H5N1 ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల కలిగే వ్యాధి. అందుకే ఇది ఎక్కువగా పక్షులు, జంతువులను ప్రభావితం చేస్తుంది. కానీ పిల్లులలో దాని ఉనికి మానవులకు కూడా వ్యాపించే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
బర్డ్ ఫ్లూ కోడి లేదా పిల్లికి మాత్రమే కాకుండా మన ఇళ్లలో నివసించే అనేక ఇతర జంతువులకు కూడా వ్యాపిస్తుందని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
మానవులలో H5N1 బర్డ్ ఫ్లూ లక్షణాలు:
H5N1 బర్డ్ ఫ్లూ కళ్ళు, ముక్కు, నోటి ద్వారా వ్యాపిస్తుంది. దీని లక్షణాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం, దగ్గు, తీవ్రమైన న్యుమోనియా ఉండవచ్చు. ఇది కాకుండా తీవ్రమైన స్థితిలో సోకిన వ్యక్తికి మూర్ఛలు కూడా రావచ్చు. దీని వల్ల ప్రాణాపాయం కూడా సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. H5N1 మానవులకు రోగనిరోధక శక్తి లేకపోవడంతో మరింత వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వ్యాధి సోకిన పిల్లులు అధిక జ్వరం, ఆకలి లేకపోవడం, నీరసంగా ఉంటుందట. వ్యాధి సోకిన తర్వాత ఒకటి నుండి మూడు రోజుల్లోపు ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయని చెబుతున్బారిన పడ్డాయి.
మనం ఇంట్లో చాలా పక్షులను పెంచుకుంటాము. అవి బర్డ్ ఫ్లూకి కారణమవుతాయి. వీటిలో కోళ్లు, బాతులు వంటి పక్షులు ఉన్నాయి. ఇంట్లో పెంచుకునే వాటిలో ఎక్కువగా కుక్కలు, పిల్లులు ఉంటాయి. అవి ఇతర పక్షులు, జంతువులతో కలిసితే వాటికి కూడా బర్డ్ ఫ్లూ రావచ్చు. పందులు సాధారణంగా ఇంటి బయట నివసిస్తాయి. కానీ వాటిని చాలా చోట్ల ఉంచుతారు. వాటికి బర్డ్ ఫ్లూ కూడా రావచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి