India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!

|

Jul 24, 2021 | 9:59 AM

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు,మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి..

India Corona Cases: దేశంలో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే!
India Corona Updates
Follow us on

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు,మరణాల్లో రోజూ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 39,097 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కి చేరింది. ఇందులో 4,08,977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కొత్తగా 35,087 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ కావడంతో.. రికవరీల సంఖ్య 3,05,03,166కి చేరింది.

అటు నిన్న 546 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 4,20,016 చేరుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటిదాకా 42.78 కోట్ల వ్యాక్సినేషన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కాగా, దేశంలో క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరిందని.. అలాగే రికవరీ రేటు 97.35 శాతంలో ఉందని పేర్కొంది.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!