ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్న వైద్యులు

| Edited By: Pardhasaradhi Peri

Aug 06, 2019 | 9:12 AM

జాతీయ వైద్య కమిషన్​ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్​ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యులంతా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. జాతీయ వైద్య కమిషన్​ చట్టాన్ని (ఎన్ఎంసీ) తొలగించేవరకు పోరాటం కొనసాగించాలని సూచించింది. భారతీయ వైద్య మండలి(ఎంఐఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్​(ఎన్​ఎంసీ) బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంటులో ఆమోదం లభించింది. అయితే బిల్లును […]

ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్న వైద్యులు
Follow us on

జాతీయ వైద్య కమిషన్​ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్​ బిల్లును వ్యతిరేకిస్తూ.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ నెల 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. వైద్యులంతా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది. జాతీయ వైద్య కమిషన్​ చట్టాన్ని (ఎన్ఎంసీ) తొలగించేవరకు పోరాటం కొనసాగించాలని సూచించింది. భారతీయ వైద్య మండలి(ఎంఐఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్​(ఎన్​ఎంసీ) బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంటులో ఆమోదం లభించింది. అయితే బిల్లును వ్యతిరేకిస్తూ డాక్టర్లు, వైద్య విద్యార్థులు నిరసనలు చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు.

మరోవైపు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు కూడా ఆందోళనలు చేపట్టినా.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో జరిగిన చర్చలు సఫలమవ్వడంతో వారు ఆందోళన విరమించుకున్నారు. వారి సందేహాలను మంత్రి నివృత్తి చేశారు. వైద్య విద్యలో ఇదో గొప్ప సంస్కరణగా నిలిచిపోతుందని తెలిపారు​.