Mukesh Ambani: దేవుడి దర్శనం కోసం బయల్దేరిన అంబానీ.. అంతలోనే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది..అసలేం జరిగింది..?

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మంగళవారం ముంబై నుండి అక్కడ దర్శనానికి బయల్దేరారు. కానీ, అనుకోకుండా మార్గ మధ్యలోనే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది.

Mukesh Ambani: దేవుడి దర్శనం కోసం బయల్దేరిన అంబానీ.. అంతలోనే వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది..అసలేం జరిగింది..?
Uttarakhand
Follow us

|

Updated on: Sep 20, 2022 | 8:51 PM

Mukesh Ambani:సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 24 వరకు ఉత్తరాఖండ్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే గత అర్థరాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా కేదార్‌నాథ్ రహదారిని రెండు చోట్ల మూసివేశారు. అదే సమయంలో కొన్ని చోట్ల శిథిలాల తొలగింపు పనులు జరుగుతుండగా మరికొన్ని చోట్ల హైవేలు మూతపడ్డాయి..వర్షం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కూడా బద్రీనాథ్ యాత్రను నిలిపివేసి ముంబైకి తిరుగు ప్రయాణమయ్యారు.

ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ సెప్టెంబర్ 21న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాగేశ్వర్, పిథోరాఘర్, నైనిటాల్, చంపావత్‌లోని ఏకాంత ప్రదేశాలలో భారీ వర్షం హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 22న, డెహ్రాడూన్ తిహ్రీ బాగేశ్వర్ పిథోరాఘర్‌కు భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 23, 24 తేదీలలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఉత్తరాఖండ్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో అనేక చోట్ల అర్థరాత్రి వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్లపై శిధిలాల ప్రవాహం కారణంగా అనేక రహదారులు బ్లాక్ చేయబడ్డాయి. కేదార్‌నాథ్ హైవే రెండు చోట్ల మూసివేశారు. బన్స్వారా, చంద్రపురిలో కొండచరియలు విరిగిపడటంతో కేదార్‌నాథ్ హైవే మూసివేయబడింది. అడ్మినిస్ట్రేషన్ టీమ్ 6 గంటల పాటు శ్రమించి బాన్సువాడలో హైవేని మూసివేశారు.అయితే చంద్రపురిలో చెత్తను తొలగించే పని ఇంకా కొనసాగుతోంది. అంబానీ దర్శనం లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో వాతావరణం ఆందోళనకరంగా మారింది. చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా సాధారణ జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. ప్రతికూల వాతావరణం కారణంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కూడా బద్రీనాథ్ పర్యటనను రద్దు చేసుకోవలసి వచ్చింది. వాస్తవానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ మంగళవారం ముంబై నుండి బద్రీనాథ్‌ దర్శనానికి బయల్దేరారు. కాని ప్రతికూల వాతావరణం కారణంగా, అతని హెలికాప్టర్ డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ విమానాశ్రయం నుండి టేకాఫ్ కాలేదు..దాంతో ముఖేష్ అంబానీ తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

సమాచారం ప్రకారం, ముకేశ్ అంబానీ మరోసారి సెప్టెంబర్ 28 న బద్రీనాథ్ ధామ్‌ను సందర్శించుకోనున్నట్టు తెలిసింది. ఉత్తరాఖండ్‌లోని కొండ ప్రాంతాలలో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం గంగోత్రి, కేదార్‌నాథ్, యమునోత్రి హేమకుండ్ మరియు బద్రీనాథ్ ధామ్ ఎగువ ప్రాంతాలలో ఈ సీజన్‌లో మొదటి హిమపాతం కురిసింది. ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురుస్తుండటంతో వాతావరణం మరింత చల్లగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?