భారీ వర్షాలు.. ఈ నెల 28 వరకు స్కూళ్లకు సెలవులు.. 12వ తరగతి వరకు నో స్కూల్!

కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో అవస్థలుపడిన ప్రజలకు ఊరట కలిగినట్లైంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన..

భారీ వర్షాలు.. ఈ నెల 28 వరకు స్కూళ్లకు సెలవులు.. 12వ తరగతి వరకు నో స్కూల్!
Heavy Rasins

Updated on: Jun 25, 2023 | 11:18 AM

న్యూఢిల్లీ: కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలతో అవస్థలుపడిన ప్రజలకు ఊరట కలిగినట్లైంది. ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్‌లలో భారీ వర్షపాతం నమోదయింది. ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో వచ్చే 2 గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్‌లోని ఫరూఖ్‌ నగర్‌, కోసాలి, మహేందర్‌గఢ్‌, సొహానా, రెవారి, నార్నౌల్‌, బావల్‌, భివారి, తిజారా, ఖైర్తాల్‌, కోట్‌పుట్లీ, ఆల్వార్‌, విరాట్‌నగర్‌, లక్ష్మాగఢ్‌, రాజ్‌గఢ్‌, నబ్దాయ్‌, భరత్‌పూర్‌, మహావా, బయానా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

బీహార్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్‌ రాజధాని పట్నాలో బాణుడి ప్రతాపం తీవ్రరూపం దాల్చుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతోపాటు వేడిగాలులతో ఆ రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో అధికారులు అన్ని పాఠశాలలకు సెలవులు జూన్‌ 28 వరకు ప్రకటించారు. 12వ తరగతి వరకు తరగతులు నిర్వహించడానికి వీల్లేదని జిల్లా మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ శనివారం ఆదేశించారు. ఇప్పటికే ఈ నెల 24 సెలవులు ప్రకటించిన బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎండ వేడిమి తగ్గకపోవడంతో మరో నాలుగు రోజులు స్కూళ్లకు సెలవులిస్తూ ప్రకటన వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.