
బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ప్యాసింజర్ బ్యాగులో ఏకంగా 3.5 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు పోలీసులు. సదరు యజమాని లగేజి స్కాన్ చేయించడానికి ట్రాలీపై బ్యాగులు సర్దుతుండగా.. ఓ అనుమానస్పద బ్యాగు.. అతడి లగేజి నుంచి కిందపడింది. తనకు సంబంధించిన బ్యాగ్ కాకపోవడంతో.. ఓపెన్ చేసి చూడగా.. అందులో 3.5 కిలోల బంగారు బిస్కెట్లు కనిపించాయి.
దీంతో ఆ బ్యాగ్ను డీఆర్ఐ అధికారులు అందించాడు సదరు వ్యక్తి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఈ బ్యాగ్ తన లగేజిలో పడేశాడని చెప్పుకొచ్చాడు. ఈ బంగారంపై అధికారులు సదరు వ్యక్తిని పలు ప్రశ్నలు ప్రశ్నించగా.. తనకు ఈ బంగారంతో ఎలాంటి సంబంధం లేదని.. ఇందులో తనను కావాలనే ఇరికిస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. ప్రస్తుతం CCTV ఫుటేజ్ ఆధారంగా స్మగ్లర్ కోసం వెతుకులాట ప్రారంభించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.