Biryani Prasadam: ఆ గుడిలో ప్రసాదంగా వేడి.. వేడి బిర్యాని.. చికెనా, మటనా మీ ఇష్టం

అదో ఆలయం.. జనవరి వచ్చిందంటే ఉత్సవాలు జరుపుతారు. తీర్థప్రసాదాలు భక్తులకు అందిస్తారు. ఇందులో ఏముంది? అన్నిచోట్లా జరిగేదేగా అని అనుకోకండి. ఈ టెంపుల్‌ ప్రసాదం వెరీవెరీ స్పెషల్‌.

Biryani Prasadam: ఆ గుడిలో ప్రసాదంగా వేడి.. వేడి బిర్యాని.. చికెనా, మటనా మీ ఇష్టం
Biryani

Updated on: Jan 09, 2023 | 4:48 PM

ప్రసాదమంటే లడ్డూ, పులిహోరా, దద్దోజనం, వడ, చక్కెర పొంగలి ఇవే గుర్తుకొస్తాయి. కానీ.. తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి గుడిలో బిర్యానీనే ప్రసాదం. వినడానికే ఆశ్చర్యంగా అనిపిస్తున్నా ఇది నిజం. మొక్కులు తీర్చుకుని భక్తులు బిర్యానీ తినేసి వెళ్లిపోతుంటారు.

ఈ బిర్యానీ ప్రసాదం ఆనవాయితీ ఇటీవల మొదలైంది కాదు. గత ఎనిమిదిన్నర దశాబ్దాలుగా ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఏటా జనవరి 24 నుంచి రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం వెయ్యి కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఈ రెండు రోజులు అదే ప్రసాదంగా అందిస్తారు.

ప్రసాదం కదా. కొంచెమే పెడతారనుకోవద్దు. ఈ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉంది. ఓవైపు పూజలు.. వాయిద్యాలు మోగుతుంటే మరోవైపు బిర్యానీ టేస్ట్‌ చూస్తుంటారు భక్తులు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us