తమిళనాడులో దడపుట్టిస్తోన్న కరోనా.. ఎయిర్‌పోర్టులో నలుగురికి పాజిటివ్‌..

|

Dec 28, 2022 | 3:59 PM

చైనాలో కరోనా నానాటికి భీభత్సం సృష్టిస్తోంది. రోజూ లక్షల మంది ప్రజలు మృతి చెందుతున్నారు. మార్చురీలు, స్మశానల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇక ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 పాజిటివ్‌ కేసులు కూడా..

తమిళనాడులో దడపుట్టిస్తోన్న కరోనా.. ఎయిర్‌పోర్టులో నలుగురికి పాజిటివ్‌..
Chennai Airport
Follow us on

చైనాలో కరోనా నానాటికి భీభత్సం సృష్టిస్తోంది. రోజూ లక్షల మంది ప్రజలు మృతి చెందుతున్నారు. మార్చురీలు, స్మశానల్లో శవాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ఇక ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బీఎఫ్‌-7 పాజిటివ్‌ కేసులు కూడా పలు దేశాల్లో భారీగా నమోదవుతున్నాయి. మన దేశంలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే వారు అధికంగా కరోనా బారీన పడుతున్నారు. ఈ క్రమంలో చెన్నై విమానాశ్రయంలో మంగళవారం (డిసెంబర్‌ 27) ఉదయం ఇద్దరికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది. చైనా నుంచి వచ్చిన ఓ మహిళ, ఆమె కుమార్తెకు కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో క్వారంటైన్‌కు తరలించారు. బుధవారం (డిసెంబర్‌ 28)న కూడా దుబాయ్‌ నుంచి చెన్నైకి వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కోవిడ్ -19 పాజిటివ్ వచ్చింది. వీరిని కూడా క్వారంటైన్‌కు తరలించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల మేరకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ టెస్టులను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మంగళ, బుధ వారాల్లో మదురై అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు కరోనా టెస్టులు చేశారు. తమిళనాడు ఆరోగ్యశాఖ అధికారులు ఈ నలుగురి శాంపిల్స్‌ను జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపినట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.