మరోసారి రాజ్యసభ సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. రాజస్థాన్ నుంచి పోటీలో నిలబడిన ఆయన.. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరణకు గడువు ముగియడం.. మన్మోహన్కు పోటీగా ఎవరు పోటీలో నిలబడకపోవడంతో ఆయన ఎన్నిక లాంచనం అయ్యింది. మన్మోహన్పై ఉన్న గౌరవంతో బీజేపీ కూడా పోటీకి దూరంగా ఉంది.