మణిపూర్ లో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1 గా నమోదైంది. మణిపూర్ కి సుమారు 55 కి.మీ. దూరంలోని ఉఖ్రుల్ లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే భూ ప్రకంపనలకు భయపడిపోయిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకృతి వైపరీత్యానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.