ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. ఎవరి పని ఇది..?

| Edited By:

Sep 05, 2019 | 7:57 AM

దర్బంగా – న్యూ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. దర్బంగా ప్రాంతంలో ఎస్6 బోగిలో బుధవారం రాత్రి 8.00గంటల ప్రాంతంలో మంటలను గుర్తించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో మంటలు చెలరేగుతున్న బోగిని ఇరువైపుల బోగీల నుంచి విడదీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది బోగిలోని మంటలను అదుపు చేశారు. అయితే ఘటనాపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనలో ఎలాంటి […]

ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. ఎవరి పని ఇది..?
Follow us on

దర్బంగా – న్యూ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. దర్బంగా ప్రాంతంలో ఎస్6 బోగిలో బుధవారం రాత్రి 8.00గంటల ప్రాంతంలో మంటలను గుర్తించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇంతలో మంటలు చెలరేగుతున్న బోగిని ఇరువైపుల బోగీల నుంచి విడదీశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది బోగిలోని మంటలను అదుపు చేశారు. అయితే ఘటనాపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని.. అయితే మంటలు చెలరేగడానికి ఎలాంటి సాంకేతిక కారణం లేదన్న అభిప్రాయానికి వచ్చారు. అయితే ఎవరో ఆకతాయిలు చేసిన పని అయిఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, జరిగిన ఘటనపై అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపడుతున్నారు.