తక్కువ అంచనా వేయకండి.. తగ్గుతున్నవి కేసులు మాత్రమే: రాకేష్ మిశ్రా
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను తక్కువ అంచనా వేయొద్దని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు

Corona Vaccine Rakesh Mishra: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాను తక్కువ అంచనా వేయొద్దని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చినా అది శాశ్వత రక్షణ ఇవ్వకపోవచ్చునని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాక్సిన్ని దేశవ్యాప్తంగా అందరికీ అందించేందుకు చాలా సమయం పడుతుందని ఆయన తెలిపారు. అంతేకాదు అన్ని ట్రయల్స్లో విజయవంతమైన వ్యాక్సిన్ వచ్చినా మధ్యవయస్సు వారిలో దీర్ఘకాలంగా సంరక్షణ ఉంటుందని చెప్పలేమని రాకేష్ మిశ్రా వెల్లడించారు.
ప్రస్తుతం మనముందు మూడు సవాళ్లు ఉన్నాయి. ఒకటవది.. పలు వయసుల వారికి ఈ వ్యాక్సిన్ ఎంతమేర పనిచేయగలదని తెలుసుకునేందుకు మనకు మరిన్ని సంవత్సరాలు పట్టొచ్చు. వ్యాక్సిన్ వచ్చి, దాన్ని వాడిని కొన్ని నెలల తరువాత ఫలితాలు తెలుస్తాయి. రెండవది కరోనాకు చాలా మంది వ్యాక్సిన్ని కనుగొనేపనిలో ఉన్నారు. ఒకవేళ అమెరికాలో తయారు చేస్తోన్న mRNA వ్యాక్సిన్ విజయవంతం అయితే, దాన్ని 80డిగ్రీల సెల్సియస్ ప్రదేశంలో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వ్యాక్సిన్ని మన పల్లెటూరులలో ఇచ్చేందుకు సరైన సదుపాయాలు లేవు. మూడో సవాల్.. మన దేశంలోని 1.3 మిలియన్ల జనానికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు చాలా సమయమే పట్టనుంది అని ఆయన తెలిపారు. ఈ వైరస్ బారి నుంచి బయటపడాలంటే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలని, అలాగే మాస్క్లను ధరించాలని రాకేష్ మిశ్రా సూచించారు. ప్రస్తుతం తగ్గుతున్న కేసులను చూసి కరోనా తగ్గిపోయిందని భావించకూడదని.. తగ్గుతున్నది కేసులు మాత్రమేనని.. తీవ్రత కాదని క్లారిటీ ఇచ్చారు.
Read More: