Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. రిక్టార్‌ స్కేలుపై 3.2గా తీవ్రత నమోదు..

|

Jul 23, 2023 | 8:11 PM

అంతకుముందు మే 11న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. మే 8న బాగేశ్వర్ జిల్లాలో 2.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదేవిధంగా మే 5, 7 తేదీల్లో భూకంపం వచ్చింది.

Earthquake: ఉత్తరాఖండ్‌లో భూకంపం.. రిక్టార్‌ స్కేలుపై 3.2గా తీవ్రత నమోదు..
Earthquake
Follow us on

Earthquake: ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో ఈరోజు సాయంత్రం 6.34 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది. ఈరోజు సాయంత్రం 6:34 గంటలకు ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్‌లో రిక్టర్ స్కేల్‌పై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, సాయంత్రం 6:34 గంటలకు భూకంపం సంభవించింది. వెంటనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం కేంద్రం భూమి నుండి 5 కిలోమీటర్ల దూరంలో సంభవించినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు మే 11న ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. మే 8న బాగేశ్వర్ జిల్లాలో 2.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదేవిధంగా మే 5, 7 తేదీల్లో భూకంపం వచ్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి .