Delhi: స్టేజిపైనే వ్యక్తిని చెప్పుతో పొట్టు పొట్టుగా కొట్టిన మహిళ.. అసలు కారణం ఇదే.. వీడియో..

|

Nov 29, 2022 | 7:30 PM

శ్రద్ధా వాకర్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో హిందూ ఏక్తా మంచ్‌ ఆధ్వర్యలో నిర్వహించిన సభలో హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశంలో మహిళ..

Delhi: స్టేజిపైనే వ్యక్తిని చెప్పుతో పొట్టు పొట్టుగా కొట్టిన మహిళ.. అసలు కారణం ఇదే.. వీడియో..
Delhi Woman Beat Slipper
Follow us on

శ్రద్ధా వాకర్ హత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో హిందూ ఏక్తా మంచ్‌ ఆధ్వర్యలో నిర్వహించిన సభలో హైడ్రామా చోటు చేసుకుంది. సమావేశంలో మహిళ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి అడ్డుకున్నాడు. మైక్‌ లాక్కున్నాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ తన మైక్‌ను లాక్కున్న వ్యక్తిని చెప్పుతో కొట్టింది. పదేపదే చెప్పుతో ఆ వ్యక్తిని ఆమె కొట్టింది. స్టేజ్‌పై ఉన్నవాళ్లు ఆ మహిళకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. అతని కాలర్ పట్టుకుని పొట్టు పొట్టుగా కొట్టేసింది.

అయితే, ఈ ఘటన వెనుక మరో కీలక అంశం దాగుంది. మహిళకు , చెప్పు దెబ్బలు తిన్న వ్యక్తికి మధ్య అంతకంటే ముందే గొడవలు ఉన్నట్టు తెలుస్తోంది. తన కూతురిని ప్రేమ పేరుతో ఆ వ్యక్తి కుమారుడు వెంబడి తీసుకెళ్లాడని ఆ మహిళ ఆరోపించారు. అదే విషయాన్ని ఆమె స్టేజ్‌పై ప్రస్తావించారు. నాలుగు రోజుల నుంచి తన కూతురి జాడ లేదని ఆమె చెబుతుండగా ఆ వ్యక్తి అడ్డుకోవడంతో గొడవ జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..