Viral Video: కారు దిగిన మహిళను దారుణంగా చితకబాదిన గుర్తు తెలియని వ్యక్తులు.. వీడియో వైరల్‌..!

Viral Video: దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్‌బాగ్‌ ప్రాంతంలో కొందరు ఓ మహిళను దారుణంగా చితకబాదారు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది...

Viral Video: కారు దిగిన మహిళను దారుణంగా చితకబాదిన గుర్తు తెలియని వ్యక్తులు.. వీడియో వైరల్‌..!

Updated on: Dec 01, 2021 | 5:44 PM

Viral Video: దేశ రాజధాని ఢిల్లీలోని షాలిమార్‌బాగ్‌ ప్రాంతంలో కొందరు ఓ మహిళను దారుణంగా చితకబాదారు. ఇందకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కారులో వచ్చిన ఓ మహిళను కిందకు దిగగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ మహిళలు దారుణంగా కొట్టారు. దీనిపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ ప్రాంతంలో ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. వారి కోసం పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 19న రాత్రి ఢిల్లీలోని షాలిమార్‌ బాగ్‌ ప్రాంతంలో ఓ మహిళ వాహనం దిగుతుండగా, ఆకతాయిలు ఆమెను దారుణంగా చితకబాదారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు ఆమె పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో పోలీసులు కొందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తుంగా, మరి కొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ దాడి స్థానిక ఓ ఎమ్మెల్యే తనను కొట్టించారని ఆ మహిళ ఆరోపిస్తోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈ దాడికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపిస్తుండగా, ఆ ఎమ్మెల్యే మాత్రం మహిళ ఆరోపణలను ఖండించారు.

 

ఇవి కూడా చదవండి

Indian Railway: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. రైళ్లను అద్దెకు ఇచ్చేందుకు ‘భారత్‌ గౌరవ్‌ స్కీమ్‌’

EPF Insurance: ఈపీఎఫ్‌ అకౌంట్‌ ఉన్నవారికి అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ ఫామ్‌ పూర్తి చేస్తే రూ.7 లక్షల బెనిఫిట్‌..!

Loading...
Unable to load recommendations.
Follow Us