Delhi Girl Murder: 22 సార్లు ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు.. చివరికి ఎలా దొరికాడంటే ?

|

May 30, 2023 | 4:02 PM

ఢిల్లీలో ప్రియురాలిని 22 సార్లు కత్తితో పొడిచి చంపిన హంతకుడు సాహిల్ పోలీసులతకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ నిందితుడి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులకు ఓ ఫోన్‌కాల్ సహాయపడింది. సాక్షిని(16) ని హత్య చేసిన అనంతరం సాహిల్ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు.

Delhi Girl Murder: 22 సార్లు ప్రియురాల్ని కత్తితో పొడిచి చంపిన ప్రియుడు.. చివరికి ఎలా దొరికాడంటే ?
Accused
Follow us on

ఢిల్లీలో ప్రియురాలిని 22 సార్లు కత్తితో పొడిచి చంపిన హంతకుడు సాహిల్(20) పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఈ నిందితుడి ఆచూకి తెలుసుకునేందుకు పోలీసులకు ఓ ఫోన్‌కాల్ సహాయపడింది. సాక్షిని(16) ని హత్య చేసిన అనంతరం సాహిల్ వెంటనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. పోలీసుల కంట పడకుండా ఉండేందుకు అతను ఉత్తర్‎ప్రదేశ్‌లోని  బులంద్‌షహర్‌లో తన బంధువుల ఇంటికి బస్సులో వెళ్లాడు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు కాల్ ఆధారంగా లోకేషన్‎ను గుర్తించి నిందితుడ్నిఅరెస్టు చేశారు.

ఇక వివరాల్లోకి వెళ్తే శనివారం రోజున సాహిల్, సాక్షిల మధ్య గొడవ జరిగింది. ఆదివారం రోజున ఆమె తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు వేడుకలు వెళ్తుండగా.. సాహిల్ కూడా ఆమె వెంట వచ్చాడు. మార్గమధ్యంలో నడిరోడ్డుపైనే ఆమెపై కత్తితో దాడిచేశాడు. ఏకంగా 22 సార్లు పొడిచాడు. ఆ తర్వాత నిర్జీవంగా పడి ఉన్న సాక్షి శరీరాన్ని సిమెంట్ దిమ్మతో కూడా కొట్టాడు. అయితే మృతురాలికి మూడేళ్ల నుంచి ఆ నిందితునితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కానీ సాక్షి అతడి నుంచి విడిపోవాలనుకోవడంతో ఈ విషయంలో ఇద్దరికి గొడవ చోటుచేసుకుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించినట్లు సమాచారం. మరోవైపు తన కూతుర్ని హత్య చేసిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలని సాక్షి తల్లి డిమాండ్ చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి