మాజీ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా

ముంబైలో మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడి గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ ద్వారా అడిగి కనుక్కున్నారు. ఒక మాజీ అధికారి అందులోనూ 65 ఏళ్ళ వ్యక్తిపై ఈ అమానుష ఎటాక్ ను ఖండిస్తున్నానని...

మాజీ నేవీ అధికారిపై శివసేన కార్యకర్తల దాడి, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరా

Edited By:

Updated on: Sep 12, 2020 | 7:56 PM

ముంబైలో మాజీ నేవీ అధికారి మదన్ శర్మపై శివసేన కార్యకర్తల దాడి గురించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ ద్వారా అడిగి కనుక్కున్నారు. ఒక మాజీ అధికారి అందులోనూ 65 ఏళ్ళ వ్యక్తిపై ఈ అమానుష ఎటాక్ ను ఖండిస్తున్నానని,   ఇలాంటి చర్యలను సహించబోనని ఆయన ట్వీట్ చేశారు. సీఎం ఉధ్ధవ్ థాక్రేపై కార్టూన్ ని వాట్సాప్ లో షేర్ చేసినందుకు ఇలా దారుణంగా దాడి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ విధమైన ఘటనలను ప్రభుత్వం ప్రోత్సహించరాదన్నారు. ఇది దురదృష్టకరమైన సంఘటన అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా మదన్ శర్మపై దాడి చేసిన ఆరుగురు సేన కార్యకర్తలను పోలీసులు బెయిల్ పై వదిలేశారు. ఒక్కొక్కరికి  5 వేల రూపాయల జరిమానా విధించి వదిలేశారు.

 

Follow Us