
India Coronavirus Updates: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు.. మళ్లీ పెరుగుతుండటం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల కాలంలో దేశంలో 20 వేలకు పైగా కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. మంగళవారం కన్నా.. బుధవారం కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. ఉపశమనం కలిగించే విషయం ఎంటంటే.. రికవరీల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో మంగళవారం దేశవ్యాప్తంగా 16,299 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,25,076 (0.28 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.58 శాతం ఉండగా.. రికవరీ రేటు 98.53 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా గణాంకాలు..
ఢిల్లీలో అత్యధికంగా..
ఢిల్లీలో అత్యధికంగా 2,146 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 1,847, కర్ణాటకలో 1,680, హర్యానాలో 1145, కేరళలో 1317 కేసులు నమోదయ్యాయి.
#COVID19 | India reports 16,299 fresh cases and 19,431 recoveries in the last 24 hours.
Active cases 1,25,076
Daily positivity rate 4.58% pic.twitter.com/6HFuOe4KSW— ANI (@ANI) August 11, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..