ఛత్తీస్గఢ్లో నక్సల్స్ రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసు ఇన్ఫార్మర్లన్న నెపంతో తీవ్రంగా కొట్టించంపేశారు. ఈ సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. అర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొట్లి మిచ్చిపర గ్రామంలో ఉండే కొందరు వ్యక్తుల్ని నక్సల్స్ తీవ్రంగా కొట్టారు. పోలీసులకు ఇన్ఫార్మర్లన్న నెపంతో ఈ ఘటనకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఈ క్రమంలో నక్సల్స్ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ స్పందించారు. నక్సల్స్లోని రెండు వర్గాల మధ్య అంతర్ఘత కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు.
Chhattisgarh: Naxals killed two people & beat up some others at Potli Michchipara village in Aranpur Police Station area of Dantewada, suspecting them to be police informers last night. SP Abhishek Pallav says, “There is an internal war between two groups of Naxals.”
— ANI (@ANI) July 23, 2020