5g In India: 5జీ నెట్‌వర్క్‌పై స్పీడ్‌ పెంచిన కేంద్రం.. ఆగస్టు 15 నాటికి దేశంలో సేవలు అందించడమే టార్గెట్‌..

|

Feb 26, 2022 | 12:11 PM

5g In India: దేశంలో ఆగస్టు 15 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం (Central Govt) అడుగులు వేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) టెలికాం శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగానే...

5g In India: 5జీ నెట్‌వర్క్‌పై స్పీడ్‌ పెంచిన కేంద్రం.. ఆగస్టు 15 నాటికి దేశంలో సేవలు అందించడమే టార్గెట్‌..
5g Services In India
Follow us on

5g In India: దేశంలో ఆగస్టు 15 నాటికి 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం (Central Govt) అడుగులు వేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) టెలికాం శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగానే 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. వివిధ బ్యాండ్‌లలో లభ్యమయ్యే స్పెక్ట్రంను వేలం వేసేందుకు ధరలు, పరిమాణంతో పాటు ఇతర షరతులకు సంబంధించిన సిఫార్సులను ట్రాయ్‌ చేయనుంది. ఇదిలా ఉంటే దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ స్పీడుతో పోలిస్తే ఇంటర్‌నెట్ స్పీడ్‌ 10 రెట్లు పెరగనుంది.

ఇక ప్రస్తుతం 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి ట్రాయ్‌ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 700 ఎమ్‌హెచ్‌జెడ్‌ నుంచి 526-698 ఎమ్‌హెచ్‌జెడ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వేలానికి పాటించాల్సిన పద్ధతులను ట్రాయ్‌ రూపొందిస్తోంది. ఇక అటు టెలికాం కంపెనీలు సైతం 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే స్పెక్ట్రమ్‌ ధరలను తక్కువగా నిర్ణయించాలని పరిశ్రమ వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇక భారత్‌లో 5జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాకముందే 5జీ సపోర్ట్ ఫోన్‌లు మార్కెట్లలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండ్‌లు 5జీ ఫోన్‌లను విడుదల చేసిన విషయం తెలిసిందే.

Also Read: Multibagger stocks: లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ. 2.25 లక్షల రాబడి.. భారీ రిటర్న్స్ ఇస్తున్న మల్టీబ్యాగర్‌ స్టాక్..

Bhanu Shree: మెస్మ‌రైజింగ్ లుక్స్‌తో మ‌తులు పొగొడుతున్న భాను శ్రీ.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

HPCL Recruitment: హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఇంకా రెండు రోజులే..