AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాకు విరుగుడు మందు..! కనిపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే

వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు సైతం తలమునకలై ప్రయత్నిస్తున్నారు. శాస్త్రవేత్తలు వైరస్ నివారణకు ‌మందులు కనుక్కునే పనిలో పడ్డారు. ఇలాంటి సమయంలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు దీనికి ఓ విరుగుడు ఉపాయం చెప్పారు. అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కరోనాకు మందును ప్రకటించారు.

కరోనాకు విరుగుడు మందు..! కనిపెట్టిన బీజేపీ ఎమ్మెల్యే
Jyothi Gadda
|

Updated on: Mar 03, 2020 | 10:04 AM

Share

యావత్ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్నమహమ్మారి కరోనా వైరస్..కరోనా దాడితో చైనాలోని వుహాన్ నగరమే దాదాపు స్మశానంగా మారిన పరిస్థితి నెలకొంది. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌ని అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు సైతం తలమునకలై ప్రయత్నిస్తున్నారు. శాస్త్రవేత్తలు వైరస్ నివారణకు ‌మందులు కనుక్కునే పనిలో పడ్డారు. ఆ వైరస్ విరుగుడు ఎప్పుడు దొరుకుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒకరు దీనికి ఓ విరుగుడు ఉపాయం చెప్పారు. అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ ఏకంగా అసెంబ్లీ సాక్షిగా కరోనాకు మందును ప్రకటించారు. ఇంతకీ ఆ మందేంటి..? అది ఎక్కడ దొరుకుతుంది..పూర్తి వివరాలు…

ప్రపంచాన్ని కలవరానికి గురిచేసి గడగడలాడిస్తున్న కొవిడ్‌ -19 భారత్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ కరోనా వైరస్‌కు విరుగుడు మందు ఉందని వెల్లడించారు. గోమూత్రం, గోవు పేడతో కరోనా వైరస్ మహమ్మారి నివారించవచ్చని వ్యాఖ్యానించారు. గో మూత్రం, ఆవు పేడ చల్లిన ప్రాంతం అంతా శుభ్రం అవుతుందని అలానే దీన్ని రాకుండా చేయవచ్చని అన్నారు. దీంతో పాటు గోమూత్రం,పేడ ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని కూడా తరిమికొడుతుందని చెప్పారు. ప్రాణాంతకంగా మారిన ఈ మహమ్మారిలను దూరం చేయడానికి ఇదే మంచి పద్దతిగా అభివర్ణించారు.

భారత్‌లో తాజాగా రెండు క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హ‌ర్షవ‌ర్ధన్. ఢిల్లీతో పాటు హైద‌రాబాద్‌కు చెందిన వ్యక్తుల‌కు కరోనా వైర‌స్‌ సోకిన‌ట్లు తేల్చారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా సోకిన వ్యక్తుల సంఖ్య ఐదుకు చేరుకుంది. కరోనా సోకిన ఇద్దరి ట్రావెల్ హిస్టరీని కూడా మంత్రి వెల్లడించారు. ప‌రిస్థితి ముదురుతున్న నేప‌థ్యంలో.. మ‌రికొన్ని దేశాల‌కు ప్రయాణ ఆంక్షల‌ను పెంచిన‌ట్లు హ‌ర్షవ‌ర్ధన్ తెలిపారు. 21 విమానాశ్రయాల్లో, 12 సీపోర్ట్స్‌, 65 మైన‌ర్ సీపోర్ట్‌ల వ‌ద్ద స్క్రీనింగ్ చేప‌డుతున్నార‌ని మంత్రి తెలిపారు.

Follow Us
రోజుకు రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్..జీవితాంతం ఉచిత బీమా!
రోజుకు రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్..జీవితాంతం ఉచిత బీమా!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
9 గంటలకే కిటికీలు క్లోజ్.. వట్టివేళ్ల తడకల మ్యాజిక్!
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ్యామిలీ మెంబర్స్ హెల్తీగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
గ్రూప్‌లో ఉన్నా సింగిల్‌గానే ఉన్నట్టు అనిపిస్తోందా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
హాట్ వాటర్, వేడి వేడి బ్రేక్‌ఫాస్ట్.. నిజంగానే హెల్తీనా?
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
Horoscope Today: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
రాత్రి ఫ్రిజ్‌లో పెట్టిన నాన్‌వెజ్ కర్రీ తింటున్నారా..? ఈ విషయం..
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
శనివారం పూజ, ఉపవాసంలో ఈ తప్పులు చేయొద్దు.. వెంకటేశ్వర స్వామి...
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?
తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. డీట్ యాప్ గురించి మీకు తెలుసా...?