AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్.. కేంద్రం భారీ ప్యాకేజీపై మండిపడ్డ సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ..!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు చతికిలపడ్డ సంగతి తెలిసిందే. అందులో మన దేశంలో కూడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడినపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రోజువారిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చేసిన ప్రకటనలపై సంఘ్ పరివార్‌కు అనుబంధ సంస్థ […]

షాకింగ్.. కేంద్రం భారీ ప్యాకేజీపై మండిపడ్డ సంఘ్ పరివార్ అనుబంధ సంస్థ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 17, 2020 | 1:14 PM

Share

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలు చతికిలపడ్డ సంగతి తెలిసిందే. అందులో మన దేశంలో కూడా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక రంగాన్ని తిరిగి గాడినపెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా రూ.20లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రోజువారిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం చేసిన ప్రకటనలపై సంఘ్ పరివార్‌కు అనుబంధ సంస్థ అయిన భారతీయ మజ్దూర్ సంఘ్ తీవ్రంగా మండిపడింది. మోదీ ప్రకటించిన ప్యాకేజీపై రోజువారీగా కేంద్ర ఆర్ధికమంత్రి వివరిస్తున్నారని.. అయితే మొదటి మూడు రోజులపాటు ప్రకటనలను ఉత్సాహంగా విన్నప్పటికీ.. నాలుగోరోజు చేసిన ప్రకటనలు నిరుత్సాహానికి గురిచేశాయని.. ఇది విచారకరమైన రోజంటూ బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విర్జేశ్ ఉపాధ్యాయ్ మండిపడ్డారు.

లాక్‌డౌన్ ప్రభావంతో బొగ్గు, ఖనిజాలు, రక్షణ శాఖ ఉత్పత్తులు, విమాన రంగం, విమానాశ్రాయాలు, విద్యుత్ లాంటి.. ఎనిమిది కీలక రంగాలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయి. అయితే ఈ రంగాలను తిరిగి పట్టాలెక్కించడానికి కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలోని ప్రభుత్వ కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండానే.. ఇలాంటి నిర్ణయాలను తీసుకోవడమేంటంటూ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సిగ్గుచేటని.. ఇది ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనంటూ విర్జేశ్ ఉపాధ్యాయ్ మండిపడ్డారు. ప్రైవేటీకరణ విషయంపై ఇప్పటికే భారతీయ మజ్దూర్ సంఘ్ అనేక ఉద్యమాలను చేపట్టిందని.. కేంద్రం తెచ్చే ప్రతీ మార్పు కూడా.. తొలుత ఉద్యోగి మీదే పడే అవకాశం ఉందని.. ఇలా ప్రైవేటీకరణ చేస్తే.. పెద్ద ఎత్తున ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కీలకమైన రంగాల్లో కేంద్రం మౌలిక మార్పులు తెస్తోందని, అవన్నీ సరిగ్గా లేవన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలనేవి ప్రాథమిక ప్రక్రియ అని.. కానీ ఆ చర్చల అంశాన్ని ప్రభుత్వం మరిచిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.