Viral News: బ‌రాత్ రోజు బుల్లెట్ కావాల్సిందే అని​ మొండిగా ప‌ట్టుపట్టిన వ‌రుడు.. ​దిమ్మ‌తిరిగే ​షాక్​ ఇచ్చిన వధువు!

వరకట్నం సమాజంలో ఇదో పెద్ద జాఢ్యం. ఎన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా.. ప‌లు ప్రాంతాల్లో మ‌నుషులు మార‌డం లేదు. చ‌దువుకున్న కుటుంబాలు...

Viral News: బ‌రాత్ రోజు బుల్లెట్ కావాల్సిందే అని​ మొండిగా ప‌ట్టుపట్టిన వ‌రుడు.. ​దిమ్మ‌తిరిగే ​షాక్​ ఇచ్చిన వధువు!
Bride Refuses Marriage
Follow us

| Edited By: Sanjay Kasula

Updated on: May 29, 2021 | 11:03 PM

వరకట్నం సమాజంలో ఇదో పెద్ద జాఢ్యం. ఎన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా.. ప‌లు ప్రాంతాల్లో మ‌నుషులు మార‌డం లేదు. చ‌దువుకున్న కుటుంబాలు కూడా ఈ వ‌ర‌క‌ట్నాన్ని డిమాండ్ చేయ‌డం అనాగ‌రికం. వ‌ర‌క‌ట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిల్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే మూపీలోని​ బరేలీలో జరిగింది. అయితే.. ఇక్కడ కట్నం అడిగిన వరుడికి పెళ్లి కూతురే ఊహించని షాకిచ్చింది. కట్నం కోసం పట్టుబట్టిన అతనితో తనకు పెళ్లి వద్దని ఖ‌రాఖండీగా చెప్పింది.

అస‌లేం జ‌రిగిందంటే…

పర్తాపుర్​ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్​ ఖాన్​ కూతురు కుల్సుమ్​కు జీషన్​ ఖాన్​తో పెళ్లిని నిశ్చ‌యించారు పెద్ద‌లు. ఫిబ్రవరిలో వారి ఎంగేజ్‌మెంట్​ జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. రెండు రోజుల క్రితం బరాత్​ పెట్టుకోగా, దానికోసం త‌మ ఆర్థిక ప‌రిస్థితికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఖలీల్ ఖాన్. త‌మ‌కు ఉన్నంత‌లో కట్నకానుకలు కూడా సిద్ధం చేశారు. అయితే ఆకస్మికంగా ల‌గ్జ‌రీ బైకు డిమాండ్​ చేశాడు వరుడు. లాక్​డౌన్​ అయినందున తక్షణం కొనుగోలు చేయడం కుద‌ర‌ద‌ని చెప్పగా.. బుల్లెట్​ ధర రూ.2.30లక్షలు అయినా ఇవ్వాల‌ని మంకు పట్టుబట్టాడు. అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయగలిగారు ఖలీల్​. కానీ, కాసేపటికే ఆయ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో అతిథులందరి ముందే ఆ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది వధువు. తండ్రి సహా ఎవరు ఎంత చెప్పినా వినలేదు. చివరకు వారి పెళ్లి రద్దు అయ్యింది.

Also Read: ఓ ఇంట్లో 8 పాము గుడ్లు కంట‌ప‌డ్డాయి.. ఇతడు అక్క‌డికి వెళ్లి, ఏం చేశాడంటే…

నాగుపాముకి నోటితో ఆక్సిజన్​.. కొనఊపిరితో ఉన్న స‌ర్పానికి మళ్లీ ప్రాణం పోసిన వ్య‌క్తి