అటల్ టనెల్ పై అప్పుడే మూడు ప్రమాదాలు

| Edited By: Pardhasaradhi Peri

Oct 06, 2020 | 9:35 PM

హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో ప్రధాని మోదీ అతి సుదీర్ఘమైన అటల్ టనెల్ ని ప్రారంభించి 24 గంటలైనా కాకముందే అక్కడ మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బైక్ రైడర్లు ఇష్టం వఛ్చినట్టు..

అటల్ టనెల్ పై అప్పుడే మూడు ప్రమాదాలు
Follow us on

హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లాలో ప్రధాని మోదీ అతి సుదీర్ఘమైన అటల్ టనెల్ ని ప్రారంభించి 24 గంటలైనా కాకముందే అక్కడ మూడు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బైక్ రైడర్లు ఇష్టం వఛ్చినట్టు వాహనాలు నడపడం, అక్కడ సెల్ఫీలు తీసుకోవడంతో ఒక్క రోజులో మూడు యాక్సిడెంట్లు జరిగి కొందరు స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, ఈ సొరంగ మార్గాన్ని అతి కష్టంమీద నిర్మించిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాపోయింది. ఇక్కడ పోలీసులను నియమించాలని కోరింది. దీంతో అధికారులు పోలీసులను నియమించారు.