AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పశ్చిమ బెంగాల్.. తుపాను బాధితుల సాయం కోసం కదిలిన ఆర్మీ

ఉమ్ ఫున్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్..ముఖ్యంగా కోల్ కతా తీవ్రంగా దెబ్బ తినడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సాయాన్ని కోరింది. దీంతో సైన్యం వెంటనే మూడు కంపెనీల సైనిక బృందాలను ఈ నగరానికి పంపింది. ఇప్పటికే పోలీసులు, ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ టీమ్ లు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. బాధితులకు ఆహారం, మంచినీరు, శానిటేషన్ తదితరాల కోసం అత్యవసరంగా మీ సేవలు కావాలని సైన్యాన్ని కోరుతూ.. రాష్ట్ర […]

పశ్చిమ బెంగాల్.. తుపాను బాధితుల సాయం కోసం కదిలిన ఆర్మీ
Umakanth Rao
| Edited By: |

Updated on: May 23, 2020 | 8:09 PM

Share

ఉమ్ ఫున్ తుపాను కారణంగా పశ్చిమ బెంగాల్..ముఖ్యంగా కోల్ కతా తీవ్రంగా దెబ్బ తినడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సాయాన్ని కోరింది. దీంతో సైన్యం వెంటనే మూడు కంపెనీల సైనిక బృందాలను ఈ నగరానికి పంపింది. ఇప్పటికే పోలీసులు, ఎన్ డీ ఆర్ ఎఫ్, ఎస్ డీ ఆర్ ఎఫ్ టీమ్ లు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. బాధితులకు ఆహారం, మంచినీరు, శానిటేషన్ తదితరాల కోసం అత్యవసరంగా మీ సేవలు కావాలని సైన్యాన్ని కోరుతూ.. రాష్ట్ర హోమ్ శాఖ ట్వీట్లు చేసింది. నగరంలో అనేక చోట్ల భారీ వృక్షాలు విరిగి పడి వాహనాలకు వాహనాలే దెబ్బ తిన్నాయి. సుమారు అయిదు లక్షలమంది ఇళ్ళు కోల్పోయి నిరాశ్రయులు  కాగా ప్రభుత్వం వారిని పునరావాస కేంద్రాలకు తరలించింది. ఈ తుఫాను కారణంగా లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని, 72 మంది మరణించారని సీఎం మమతా బెనర్జీ ఇదివరకే ప్రకటించారు. ప్రధాని మోదీ శుక్రవారం తుపాను ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వెయ్యి కోట్లు, ఒడిశా రాష్ట్రానికి 500 కోట్ల పరిహారాన్ని ప్రకటించారు. అటు- బాధితులను ఆదుకునేందుకు మమతా బెనర్జీ సైన్యం సాయం కోరడం పట్ల గవర్నర్ జగ దీప్ ధన్కర్ ఆమెను అభినందిస్తూ ట్వీట్లు చేశారు.