
ఈ వార్త చదివాక చెప్పండి.. కులం, మతం, ప్రాంతం ముఖ్యమో.. మానవత్వం ముఖ్యమో. ఎక్కడో విదేశాల్లో ఉండే గుర్తు తెలియని వ్యక్తి.. మన దేశంలోని కేరళలో ఓ చిన్నోడికి బాలేదని తెలిసి.. అతడికి చికిత్స కోసం.. ఏకంగా 11 కోట్లు డొనేట్ చేశాడు. పైగా తన పేరు, వివరాలు ఎక్కడా మెన్షన్ చేయలేదు.ఎర్నాకులానికి చెందిన నేవీ ఆఫీసర్ సారంగ్, అతిథిల తనయుడు నిర్వాణ్ వయసు 16 నెలలు. అయితే అతడు పుట్టినప్పుటి నుంచి కాళ్లు కదపడం లేదు. దీంతో ఆందోన చెందిన తల్లిదండ్రులు.. ఇటీవల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు చిన్నోడు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 2 అనే డిసీజ్తో బాధ పడుతున్నట్లు వెల్లడించారు.
అయితే 2 ఏళ్ల ముందు మందులు వాడితేనే ట్రీట్మెంట్ చేసేందుకు వీలవుతుందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆ మెడిసిన్ను అమెరికా నుంచి తెప్పించాలంటే.. రూ.17.5 కోట్లు ఖర్చవుతుంది. ప్రజంట్ చిన్నారికి 16 నెలలు. అంటే ఇంకో 8 నెలల్లోగా వైద్యం చేయించాలి. అంత ఆర్థిక స్థోమత ఆ కుటుంబానికి లేదు. దీంతో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించారు. దీంతో చిన్నోడి వైద్య చికిత్స కోసం దాతలు భారీ ఎత్తున విరాళాలు పంపడం ప్రారంభించారు. ఈ సమయంలోనే ఓ ఫారెనర్ తన నేమ్ చెప్పకుండా 11 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశాడు. ఇంకో 80 లక్షలు సమకూరితే.. చిన్నోడి చికిత్సకు సరిపడా డబ్బులు వస్తాయి.
దీంతో చికిత్సకు అవసరమైన మిగిలిన డబ్బుల కోసం ఆ బాలుడి ఫ్యామిలీ ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. నిర్వాణ్ కోలుకున్న తర్వాత తమకు రూ.11 కోట్ల అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించిన వ్యక్తిని ఎలాగోలా కలిసి.. ధన్యవాదాలు చెబతామని బాబు ఫ్యామిలీ మెంబర్స్ తెలిపారు. కోట్లు సంపాదించిన వాళ్లందరూ కాటిలోకి ఆ ధనాన్ని తీసుకెళ్లలేరు కదా.. ఇలాంటి దానాలు చేస్తే.. ఒక ప్రాణాన్ని నిలబెట్టామన్న ఆత్మసంతృప్తి దక్కుంతుంది. ఏమంటారు ఫ్రెండ్స్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..