జమ్మూలో శ్రీవారి ఆలయం.. 62 ఎకరాలు మంజూరు.. ఆమోదం తెలిపిన జమ్మూ – కశ్మీర్ పరిపాలనా మండలి..

|

Apr 05, 2021 | 5:42 AM

Venkateswara Temple in Jammu : వేంకటేశ్వరుడి భక్తులు ఇకనుంచి జమ్మూలో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు.. అందుకు సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ పరిపాలనా

జమ్మూలో శ్రీవారి ఆలయం.. 62 ఎకరాలు మంజూరు.. ఆమోదం తెలిపిన  జమ్మూ - కశ్మీర్ పరిపాలనా మండలి..
Venkateswara Temple In Jamm
Follow us on

Venkateswara Temple in Jammu : వేంకటేశ్వరుడి భక్తులు ఇకనుంచి జమ్మూలో కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు.. అందుకు సంబంధించిన పనులు చక చకా జరుగుతున్నాయి. తాజాగా జమ్మూ కశ్మీర్ పరిపాలనా మండలి ఆలయ నిర్మాణానికి 62 ఎకరాలు కేటాయించింది. మజీన్ గ్రామంలో 62.02 ఎకరాల భూమిని ఇవ్వడానికి ఓకే చెప్పింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని కౌన్సిల్… శ్రీనగర్-పఠాన్‌కోట్ రహదారి వెంట సిధ్రా బైపాస్‌లో భూమిని తితిదేకు 40 సంవత్సరాల లీజుకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించింది.

పర్యాటక రంగ అభివృద్ధి కోసం జమ్మూలో ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది.. ఆలయ నిర్మాణం పూర్తయితే.. మాతా వైష్ణోదేవీ ఆలయం, అమర్​నాథ్ క్షేత్రాల తరహాలో పర్యాటకులు వస్తారని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూరుతుందని నాయకులు చెబుతున్నారు. ఆలయం, దాని అనుబంధ మౌలిక సదుపాయాలు, యాత్రికుల సౌకర్యాల సముదాయం, వేద పాఠశాల, ధ్యాన కేంద్రం, ఆఫీసు, రెసిడెన్షియల్ క్వార్టర్స్, పార్కింగ్ వంటి వాటికి… స్వాధీనం చేసుకున్న తేదీ నుంచి 40 సంవత్సరాల కాలానికి లీజు ప్రతిపాదన ఆమోదించారు. ఇకనుంచి జమ్మూ మరో తిరుమలగా మారనుందని అర్థం. అంతేకాకుండా శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు రాలేని ఉత్తర భారత ప్రాంత వాసులు జమ్మూకు వెళ్లి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో కోపం మంచిదేగా.. రిఫరీపై ఆగ్రహం.. అది ఎందరికో సహాయంగా మారింది..

చిరంజీవి ఇచ్చిన స్ఫూర్తి వల్లే రాజకీయాల్లోకి వచ్చా..! అభిమానులు లేకపోతే పవన్‌ కల్యాణ్ లేడు.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో వకీల్‌ సాబ్‌..

కోవూరులో మద్యం మత్తులో ఏఎస్పీ వీరంగం.. హోటల్ సిబ్బంది, బాటసారులపై దాడి.. మండి పడుతున్న స్థానికులు

పవన్‌ కల్యాణ్ ఓ వ్యసనం.. అలవాటైతే చనిపోయే వరకు వదల్లేం.. వకీల్‌ సాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బండ్ల గణేశ్‌ మాటలు..