ఉపముఖ్యమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు దుండగుల యత్నం.. అరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..

|

Dec 10, 2020 | 6:56 PM

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లోకి చొరబడేందుకు ఆరుగరు దుండగులు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు.

ఉపముఖ్యమంత్రి ఇంట్లోకి చొరబడేందుకు దుండగుల యత్నం.. అరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు..
Follow us on

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లోకి చొరబడేందుకు ఆరుగరు దుండగులు ప్రయత్నించారని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఈ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే వారు ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మరోవైపు ఈ ఘటనపై ఆప్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ సానుభూతిపరులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన ఆప్ లీడర్ అతిషి.. ఈ ఘటనలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రమేయం ఉందని ఆరోపించారు. సిసోడియా లేని సమయాన్ని చూసి పోలీసుల సహకారంతోనే బీజేపీ శ్రేణులను అమిత్ షా ఉసిగొల్పారని అతిషి ఫైర్ అయ్యారు. ఈ ఘటన ఢిల్లీ రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయం అని పేర్కొన్నారు.