Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది యాత్రికుల కోసం రెస్క్యూ..

|

Jul 26, 2024 | 3:30 PM

ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హిల్‌ స్టేట్‌కు వెళ్లిన యాత్రికులు ఈ వర్షాలకు చిక్కుకుపోతున్నారు. తాజాగా రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది యాత్రికుల కోసం రెస్క్యూ..
Uttarakhand
Follow us on

ఉత్తరాఖండ్‌ ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పవిత్ర పుణ్యభూమి ఉత్తరాఖండ్‌ అస్తవ్యస్థంగా మారింది. కొండచరియలు విరిగిపడటంతో యాత్ర నిలిపివేశారు అధికారులు.గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మరోవైపు ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు హిల్‌ స్టేట్‌కు వెళ్లిన యాత్రికులు ఈ వర్షాలకు చిక్కుకుపోతున్నారు. తాజాగా రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం సమీపంలో సుమారు 50 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

రుద్రప్రయాగ్‌ జిల్లాలోని మద్మహేశ్వర్‌ ఆలయం ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. వరదల కారణంగా మార్కండ నదిపై నిర్మించిన తాత్కాలిక వంతెన కొట్టుకుపోయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో ఆలయానికి వెళ్లిన భక్తులు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌ యాత్రికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని.. ప్రజలు కొండ ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.