కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..

| Edited By:

Jun 29, 2019 | 8:41 PM

కేరళలో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓమ్నీ కారు ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ కుటుంబం కేరళలోని వలయార్‌కు వెళుతుండగా పాలక్కాడ్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మరికాసేపట్లో గమ్యస్థానం చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ మహిళ, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన పాలక్కడ్ ఆసుపత్రికి తరలించారు.

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం..
Follow us on

కేరళలో విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని ఓమ్నీ కారు ఢీ కొట్టడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఓ కుటుంబం కేరళలోని వలయార్‌కు వెళుతుండగా పాలక్కాడ్ జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మరికాసేపట్లో గమ్యస్థానం చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో పాటు ఓ మహిళ, వ్యాన్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన పాలక్కడ్ ఆసుపత్రికి తరలించారు.