Delhi Violence : ఢిల్లీ అల్లర్లలో 13కి చేరిన మృతుల సంఖ్య..CBSE పరీక్షలు వాయిదా

సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. గత రెండు.. మూడు రోజులుగా చోటుచేసుకున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. మరో 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్విటర్‌ వేదికగా […]

Delhi Violence : ఢిల్లీ అల్లర్లలో 13కి చేరిన మృతుల సంఖ్య..CBSE పరీక్షలు వాయిదా

Updated on: Feb 26, 2020 | 6:07 AM

సీఏఏ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. గత రెండు.. మూడు రోజులుగా చోటుచేసుకున్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 13 మంది మృతిచెందారు. వీరిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. మరో 150 మందికి పైగా గాయాలపాలయ్యారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ ప్రాంతాల్లో బుధవారం జరగాల్సిన టెన్త్, సీబీఎస్ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

మరోవైపు పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు.. పోలీసులు.. కేంద్ర బలగాలు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సున్నిత ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. కర్నాల్ నగర్, జాఫరాబాద్, మౌజ్‌పూర్, చాంద్ బాగ్‌‌,కర్వాల్, బాబర్‌పూర్‌ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us