మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. బ్యాంక్ లావాదేవీల్లో మార్పులు వచ్చాయి. ఫిబ్రవరి నెల నుండి మారుతున్న కొన్ని ముఖ్యమైన నియమాలను గుర్తుంచుకోండి. ఈ నియమాలు IMPS, NEFT, RTGSకి సంబంధించినవి. ఇవన్నీ ఫిబ్రవరి నుంచి మారుతున్న ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించినవి . స్టేట్ బ్యాంక్ ఐఎంపీఎస్ లావాదేవీల పరిమితిని మార్చి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. 5 లక్షల వరకు డిజిటల్ ఐఎంపీఎస్ లావాదేవీలు జరిపితే దానిపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్టేట్ బ్యాంక్ తెలిపింది. అంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ద్వారా IMPS చేస్తే, 5 లక్షల వరకు లావాదేవీలకు ఎటువంటి ఛార్జీ ఉండదు. కానీ అదే IMPS బ్యాంకు శాఖలో చేస్తే, దాని ఛార్జ్లో మినహాయింపు ఇవ్వబడదు. బదులుగా, దీనికి కొత్త ఛార్జీని ప్రకటించారు. బ్యాంకు శాఖలో 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఐఎంపీఎస్ చేస్తే రూ.20తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.
ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా NEFT లావాదేవీలు చేయడానికి ఎటువంటి సేవా ఛార్జీ లేదా GST ఉండదు. YONO యాప్ ద్వారా చేసే NEFT లావాదేవీలపై కూడా ఎటువంటి ఛార్జీ ఉండదు, ఈ నియమం రూ. 2 లక్షల వరకు ఉంటుంది.
ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్ , యోనో యాప్ ద్వారా చేసే RTGS లావాదేవీలపై సేవా ఛార్జీ లేదా GST ఉండదు. RTGS పరిమితి రూ. 6 లక్షల కంటే ఎక్కువ ఉంటే, దానిపై ఎటువంటి ఛార్జీ విధించబడదు.
ఇవి కూడా చదవండి: MMTS Trains: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు అలర్ట్.. పలు మార్గాల్లో రైళ్లు రద్దు..