Income Tax Returns: పన్ను ఎగవేతదారులకు షాకింగ్ న్యూస్.. 15 ఏళ్ల ఐటీ రిటర్న్స్‌ను పరిశీలించబోతున్న ఆదాయపన్ను శాఖ!

ఆదాయపు పన్ను శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో పన్ను ఎగవేసిన వాళ్ల పనిపట్టేందుకు కొత్త పద్దతిని ప్రవేశపెట్టబోతోంది. అల్గోరిథమ్స్‌ పద్దతితో సుమారు 15 ఏళ్ళ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ అస్సేస్మెంట్ చేయబోతున్నారు.

Income Tax Returns: పన్ను ఎగవేతదారులకు షాకింగ్ న్యూస్.. 15 ఏళ్ల ఐటీ రిటర్న్స్‌ను పరిశీలించబోతున్న ఆదాయపన్ను శాఖ!
Income Tax Returns

Updated on: Mar 15, 2022 | 5:10 PM

Income Tax Returns: ఆదాయపు పన్ను శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో పన్ను ఎగవేసిన వాళ్ల పనిపట్టేందుకు కొత్త పద్దతిని ప్రవేశపెట్టబోతోంది. అల్గోరిథమ్స్‌(Algorithm Basis) పద్దతితో సుమారు 15 ఏళ్ళ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ అస్సేస్మెంట్(IT Returns Assessment) చేయబోతున్నారు. ముందు ఏదైనా ఫిర్యాదు వస్తేనో అకౌంట్స్ లో తేడా వస్తే టాక్స్ ఆఫీసర్లు రీ అస్సేస్మెంట్ చేసేవాళ్ళు . ఇప్పుడు కంప్యూటర్లు మొత్తం డేటా చూసి చిన్న తేడా వున్నా నోటీసులు పంపే ప్రక్రియ మొదలయ్యింది. సెక్షన్ 148A IT Act కింద ఏ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

దేశంలో 30% ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ముంబై నుండే ఫైల్ అవుతాయి. కేవలం ముంబై లోనే ప్రతి సంవత్సరం 50 వేలు నోటీసులు ఇస్తున్నారు. అయితే కొత్త విధానం ప్రకారం సుమారు 7.5 లక్షల నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఎక్కువ తేడాలు ఉన్న రిటర్న్స్ ని హై రిస్క్ VRU ( వెరియబుల్ రిపోర్ట్ అప్లోడ్ )గా పరిగణిస్తారు. నోటీసు వచ్చిన వారం లోపు సమాధానం ఇవ్వకపోతే . వెంటనే కేసు పెట్టాలని నిర్ణయించింది ఆదాయపు పన్నుశాఖ . ప్రతి ఏటా దేశంలో ఆదాయపు పన్నులు చెల్లించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలొ పన్ను ఎగవేతదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకే కొత్త టెక్నాలజీ సాయంతో పన్నుఎగవేత దారులను గుర్తించే పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, పాత అసెస్‌మెంట్‌ను తిరిగి తెరిచే ప్రక్రియను ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించింది. పన్ను అధికారులు ‘INSIGHT’ని ట్రాక్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ పోర్టల్ ఫీడ్ చేయబడిన డేటా అల్గారిథమిక్ స్కానింగ్ తర్వాత పన్ను ఎగవేతదారుల పేరును గుర్తిస్తారు. కొత్త నియమం 2021-22 నుండి అమల్లోకి వచ్చింది. కాగా, కొత్త పద్దతి ప్రకారం పన్న ఎగవేతదారులకు నోటీసులు పంపించాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. తదనుగుణంగా ప్రతిస్పందించడానికి అసెస్సీకి ఒక వారం సమయం ఇవ్వబడుతుంది. తరువాతి పక్షం రోజులలోపు పునఃప్రారంభ నోటీసు జారీ చేయనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నుండి తొమ్మిది నెలలలోపు అన్ని ప్రతిస్పందనలను రికార్డ్ చేయడం, షో-కాజ్ నోటీసును అందించడం వంటి పూర్తిస్థాయి పునఃమూల్యాంకనం ప్రారంభమవుతుంది. ఒక వేళ, సక్రమంగా నగదు చెల్లింపు కంపెనీకి తిరిగి వచ్చే మార్గాన్ని కనుగొనే వసతి రుణ ప్రవేశం ఉంది. అటువంటి సందర్భంలో, కంపెనీకి రుణదాతలందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని ఆదాయ పన్ను శాక అధికారి తెలిపారు.

Read Also…  Mirchi Rasgulla: ఘాటెక్కించే మిర్చి రసగుల్లా.. ఇది చాలా హాట్ గురూ.. టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందే