
చలి రోజురోజుకూ పెరుగుతోంది. కాబట్టి ఈ సీజన్లో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా కూడా ప్రాణాంతకం కావచ్చు. అంతేకాకుండా శీతాకాలంలో మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ అలవాటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం, పొగమంచు, చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మార్నింగ్ వాక్ చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఉదయం లేచి ఎవరు మార్నింగ్ వాక్కు వెళ్లకూడదు? ఈ అలవాటు ఎవరికి మంచిది కాదు? వంటి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..
శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నించినప్పుడు, రక్త నాళాలు సంకోచిస్తాయి. ఇది రక్తపోటును పెంచుతుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. అందువల్ల గుండె రోగులు, అధిక రక్తపోటు ఉన్నవారు, వృద్ధులు వీలైనంత వరకు మార్నింగ్ వాక్కు వెళ్లకుండా ఉండాలి. వైద్యుల సలహా ప్రకారం రిస్క్ గ్రూప్లో లేనివారు అంటే పైన పేర్కొన్న సమస్యలు లేనివారు ఎవరైనా మార్నింగ్ వాకింగ్కు వెళ్లవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు అవసరం.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.