
సీఎంగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకార కార్యక్రమ వేడుక కోసం త్రిష ధరించిన ఐస్-బ్లూ సిల్క్ చీర నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఆమె లుక్ చూస్తుంటే 2000వ సంవత్సరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని కలిసినప్పుడు ఐశ్వర్యరాయ్ ధరించిన చీరను గుర్తుకు తెస్తోందని ఇంటర్నెట్ వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. దీంతో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలోని నందిని (ఐశ్వర్య), కుందవై (త్రిష) పాత్రలను పోలుస్తూ ఫోటోలు షేర్ చేస్తున్నారు.
విజయ్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం త్రిష ఎంతో హుందాగా, సాంప్రదాయబద్ధంగా సిద్ధమయ్యారు. పోతీస్ బ్రాండ్కు చెందిన ఐస్-బ్లూ కలర్ సిల్క్ చీరను ఆమె ఎంచుకున్నారు. దీనికి జతగా ‘నిరామ్’ డిజైన్ చేసిన కస్టమ్ బ్లౌజ్ను ధరించారు. జీఆర్టీ జ్యువెలర్స్ వారి డైమండ్, రెడ్ స్టోన్ జ్యువెలరీతో త్రిష మెరిసిపోయారు. గజ్రాతో కూడిన లో-బన్, కోల్-లైన్డ్ కళ్లు డ్యూయీ మేకప్తో ఆమె తన రూపాన్ని పూర్తి చేశారు.
త్రిష ఫోటోలు బయటకు రాగానే, నెటిజన్లు ఐశ్వర్యరాయ్ పాత ఫోటోలను వెలికితీశారు. 2000వ సంవత్సరంలో ఐశ్వర్యరాయ్ కూడా దాదాపు ఇలాంటి రంగు కలిగిన గోల్డెన్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ చీరను ధరించారు. అప్పట్లో ఆమె గోల్డ్ జ్యువెలరీ, వింగ్డ్ ఐలైనర్ మరియు పింక్ లిప్స్టిక్తో కనిపించారు. ఒక నెటిజన్ ‘ఇదే టెంప్లేట్’ అని వ్యాఖ్యానించగా, మరికొందరు ఆమె ‘కందుకొండైన్ కందుకొండైన్’ చిత్రంలోని లుక్తో పోల్చారు.
ఇంకొకరు త్రిష ధరించినది ‘ఇరువర్’ చిత్రంలో ఐశ్వర్య కట్టిన చీర అని తప్పుగా పేర్కొన్నప్పటికీ, మొత్తానికి ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య జరుగుతున్న ఈ ఫ్యాషన్ వార్ ఆసక్తికరంగా మారింది. మణితరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ 1 మరియు 2 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే.