AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC టూర్ ప్యాకేజ్: వీసా లేకుండానే రైలులో నేపాల్ ట్రిప్.. 10 రోజుల సూపర్ జర్నీ!

Indian Railway Catering and Tourism Corporation జూన్ 12న నేపాల్‌కు ప్రత్యేక “భారత్ గౌరవ్” పర్యాటక రైలును ప్రారంభిస్తోంది. “పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర” పేరుతో నడిచే ఈ రైలు భారత సరిహద్దులు దాటి ప్రయాణించే తొలి భారత్ గౌరవ్ రైలు కానుంది. ఇది పర్యాటకులు, యాత్రికులకు ప్రత్యేక అవకాశంగా నిలవనుంది.

IRCTC టూర్ ప్యాకేజ్: వీసా లేకుండానే రైలులో నేపాల్ ట్రిప్.. 10 రోజుల సూపర్ జర్నీ!
Irctc Nepal Tour By Train 2026
Rajashekher G
|

Updated on: May 21, 2026 | 10:23 PM

Share

IRCTC Nepal Tour Package: భారతీయ రైల్వే చరిత్రలో మరో విశిష్ట ఘట్టానికి తెరలేచింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రారంభించిన ‘భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్’ తొలిసారిగా అంతర్జాతీయ సరిహద్దు దాటి నేపాల్‌కు ప్రయాణించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక యాత్రను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నిర్వహిస్తోంది. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక–పర్యాటక యాత్రకు ‘పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర’ అని పేరు పెట్టారు.

ఇది భారతదేశ సరిహద్దులను దాటి ప్రయాణించే తొలి భారత్ గౌరవ్ రైలు కావడం ప్రత్యేకత. యాత్రికులు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం నుంచి వసతి, భోజనం, స్థానిక దర్శనాలు వరకు అన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయి. సురక్షితంగా, సౌకర్యవంతంగా నేపాల్ పర్యటన చేయాలనుకునేవారికి ఇది అరుదైన అవకాశం అని IRCTC తెలిపింది.

10 రోజుల ప్రత్యేక నేపాల్ యాత్ర

ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు – 10 రోజులపాటు కొనసాగుతుంది. నేపాల్‌లోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను ఇందులో చేర్చారు. కాఠ్మండు, పశుపతినాథ్ ఆలయం, పోఖారా, చిత్వాన్ నేషనల్ పార్క్, మనకామన ఆలయం వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

యాత్రలో ప్రధాన ఆకర్షణలు

  • కాఠ్మండు – నేపాల్ రాజధానిలోని చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ఆస్వాదించే అవకాశం
  • పశుపతినాథ్ ఆలయం – ప్రపంచ ప్రసిద్ధ శివక్షేత్ర దర్శనం
  • పోఖారా – హిమాలయాల నడుమ అందమైన సరస్సుల నగరం
  • చిత్వాన్ నేషనల్ పార్క్ – జీప్ సఫారీ ద్వారా వన్యప్రాణుల సందర్శనం
  • మనకామన ఆలయం – రోప్‌వే ప్రయాణంతో కొండపై ఉన్న ప్రసిద్ధ ఆలయ దర్శనం

ఎక్కడెక్కడి నుంచి రైలు ఎక్కొచ్చు?

ఈ ప్రత్యేక రైలు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌తో పాటు ఉజ్జయిన్, షుజల్పూర్, భోపాల్, ఇటార్సీ, నర్సింగ్‌పూర్, జబల్‌పూర్, కట్నీ, సత్నా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది.

రైలు ప్రత్యేకతలు

డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలుగా రూపొందించిన ఈ ట్రైన్‌లో మొత్తం 14 కోచ్‌లు ఉంటాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కేటగిరీలలో టికెట్లు అందుబాటులో ఉంచారు.

ప్యాకేజీ ధరలు

  • థర్డ్ ఏసీ కంఫర్ట్ – రూ. 62,710
  • సెకండ్ ఏసీ డీలక్స్ – రూ. 76,550
  • ఫస్ట్ ఏసీ సుపీరియర్ – రూ. 90,400

ప్యాకేజీలో ఏమేమి ఉంటాయి?

ఈ ధరల్లో కేవలం రైలు టికెట్ మాత్రమే కాదు, యాత్రకు సంబంధించిన దాదాపు అన్ని ప్రధాన సౌకర్యాలు చేర్చబడ్డాయి.

  • నేపాల్‌లో త్రీ-స్టార్ హోటళ్లలో వసతి
  • భోజన సదుపాయం
  • ఏసీ బస్సుల ద్వారా స్థానిక ప్రయాణం
  • ట్రావెల్ ఇన్సూరెన్స్
  • ప్రత్యేక టూర్ గైడ్ సేవలు

ఆధ్యాత్మికత, ప్రకృతి సౌందర్యం, సాహస యాత్ర — ఈ మూడు అనుభూతులను ఒకేసారి అందించే ఈ ‘పశుపతినాథ్ నేపాల్ దర్శన్ యాత్ర’ పర్యాటకులకు ఒక మరిచిపోలేని అనుభవంగా నిలవనుంది.

Follow Us