
ఈ వేసవి సెలవుల్లో అరుణాచలం వెళ్లేందుకు తెలంగాణ టూరిజం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అరుణాచలం టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనున్నారు. ఈ టూర్ ప్యాకేజీ జూన్ 8, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఇందులో బస్సు జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ – అరుణాచలం టూర్ ప్యాకేజీని https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
ఇందులో మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్ లోని బషీర్ బాగ్ నుంచి బయల్దేరుతారు. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. అదే రోజు అరుణాచలేశ్వరుడి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే ఉంటారు.
అరుణాచలం టూర్ వెళ్లాలనుకుంటున్నవారు తెలంగాణ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘HYDERABAD – ARUNACHALAM’ పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ధరల వివరాలన్నీ అన్ని అక్కడ క్లియర్ తెలుసుకోవచ్చు. ఇకపోతే, అరుణాచలంలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదిక్షణ చేయవచ్చు.
ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30వరకు మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 9.30 వరకు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అనంతరం గిరిప్రదిక్షణ చేయవచ్చు. దీనికి నడిచే సామర్థ్యం బట్టి సమయం పడుతుంది. కొందరికి 4 నుంచి 6 గంటలు సమయం పడుతుంది. మరికొందరు 3 గంటల్లో కూడా కంప్లీట్ చేస్తారు. నడవలేను అనుకునేవారు ఆటోకి వెళ్లొచ్చు. వాళ్లు 9 టెంపుల్స్ దగ్గరకి మిమ్మల్ని తీసుకువెళ్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..