
సాయంత్రం వేళల్లో చల్లటి వాతావరణంలో వేడిగా, కారంగా ఉండే చిరుతిళ్లు తినాలనే కోరిక కలగడం సహజం. ముఖ్యంగా శీతాకాలం, వర్షాకాలంలో మనస్సు సమోసాలు, పకోడీలు, బజ్జీలు వంటి వేయించిన ఆహారాల వైపు వెళుతుంది. కానీ మీకు తెలుసా ఈ ఆహారాలు తినే సమయం మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందట. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల తర్వాత మీరు తినే ఆహారం మీ జీర్ణక్రియ, జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటి రుచి కోసం తీసుకునే కొన్ని ఆహారాలు శరీరంలో కొవ్వు, చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతాయి. కాబట్టి ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. కాబట్టి సాయంత్రం వేళల్లో మీరు ఏ రకమైన ఆహారాలు తినకూడదు? ఎందుకు తినకూడదు? వీటికి బదులుగా సాయంత్రం స్నాక్స్గా తినే చిరుతిళ్లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
సమోసాలు, పకోడాలు, అధిక వెన్న కంటెంట్ ఉన్న బర్గర్లు, పిజ్జాలు వంటి జంక్ ఫుడ్ అస్సలు తీసుకోకూడదు. అలాగే జిలేబీ,అధిక చక్కెర కంటెంట్ ఉన్న ఇతర స్వీట్లు వద్దనే వద్దు. మసాలా పూరి వంటి కారంగా ఉండే ఆహారాలు కూడా ముట్టుకోవద్దు.
వేయించిన ఆహారాలు టైప్-2 డయాబెటిస్తో నేరుగా ముడిపడి ఉంటాయి. అవి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను దెబ్బతీస్తాయి. రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అంతే కాదు అవి గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యలను కూడా కలిగిస్తాయి. వేయించిన ఆహారాలు పేగులోని మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తాయని, మంటను పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వాటిలోని అధిక కేలరీలు శరీరంలో వేగంగా కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.