AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీళ్లు కాదు.. వీటిని పాలల్లో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే

ఎంతో రుచిగా ఉండే ఎండు ద్రాక్షను.. సాధారణంగా పాయసం, హల్వా, స్వీట్లలో ఉపయోగిస్తుంటాం. ఈ మధ్యకాలంలో వీటిని నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం కూడా ఒక అలవాటుగా మారింది. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం ఎండుద్రాక్షను నీటిలో కన్నా పాలలో నానబెట్టి ఉదయాన్నే తింటే..

నీళ్లు కాదు.. వీటిని పాలల్లో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే
Soaked Raisins Milk Benefits
Srilakshmi C
|

Updated on: May 25, 2026 | 1:11 PM

Share

ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో ఎండుద్రాక్ష ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా వీటిని పాయసం, హల్వా, స్వీట్లలో ఉపయోగిస్తుంటాం. ఈ మధ్యకాలంలో వీటిని నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం కూడా ఒక అలవాటుగా మారింది. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం ఎండుద్రాక్షను నీటిలో కన్నా పాలలో నానబెట్టి తినడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. పాలు, ఎండుద్రాక్షల కలయిక శరీరానికి కాల్షియం, ప్రోటీన్, ఐరన్, ఫైబర్‌ను పుష్కలంగా అందిస్తుంది. ఇది ఎముకలను బలపరచడమే కాకుండా శరీర శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ పద్ధతి వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

రక్తహీనత, రక్తపోటును నియంత్రిస్తుంది

ఎండుద్రాక్షలో ఐరన్‌, పొటాషియం అధికంగా ఉంటాయి. వాటిని రాత్రంతా పాలలో నానబెట్టడం వల్ల శరీరం వాటిలోని పోషకాలను సులభంగా జీర్ణం చేసుకుంటుంది. ప్రతి ఉదయం వాటిని తినడం వల్ల రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

ఎండుద్రాక్షలో ఉండే పీచుపదార్థం మలబద్ధకం సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పాలలో నానబెట్టిన తర్వాత అది మెత్తబడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. ఖాళీ కడుపుతో ఎండుద్రాక్ష తినడం వల్ల కడుపులో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గుండె, చర్మ ఆరోగ్యానికి మేలు

ఎండుద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవి పొడి చర్మం, మొటిమలు, మచ్చల వంటి సమస్యలను కూడా తగ్గించి, ముఖానికి కాంతిని పెంచుతాయి.

బరువు నియంత్రణ

దీనిలో పీచుపదార్థం అధికంగా ఉండటం వల్ల ఈ మిశ్రమం మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా ఉంచుతుంది. దీనివల్ల అతిగా తినే ధోరణి తగ్గుతుంది. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది సహాయపడుతుంది.

అయితే ఏ ఆహారాన్నైనా అతిగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. అందువల్ల దీనిని మితంగా, వైద్యుని సలహాతో తీసుకోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 నిర్ధారించడం లేదు. ఇతర వివరాలకు నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us