AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఎక్కువ నీరు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే.. ఇంకోసారి ఆ తప్పు..

అవసరానికి మించి నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం తగ్గి, కణాలు ఉబ్బిపోతాయి. ఇది ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా కాలేయ సమస్యలు ఉన్నవారికి ఈ ముప్పు మరింత ఎక్కువ. మీ శరీరానికి సరైన నీటి పరిమాణం తెలుసుకోవడం, ప్రమాదకర సంకేతాలను గుర్తించడం ముఖ్యం. డైలీ ఎంత నీరు తాగాలంటే..?

వామ్మో.. ఎక్కువ నీరు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలిస్తే షాకే.. ఇంకోసారి ఆ తప్పు..
Drinking Too Much Water Danger
Krishna S
|

Updated on: Nov 22, 2025 | 5:31 PM

Share

చిన్నప్పటి నుంచీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నీరు త్రాగాలని నేర్చుకున్నాం. నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతో పాటు అలసట నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అవసరానికి మించి నీరు తాగడం కూడా డీహైడ్రేషన్ లాగానే ప్రమాదకరమని మీకు తెలుసా..? ముఖ్యంగా ఇప్పటికే కాలేయ సమస్యలు ఉన్నవారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.

ఓవర్‌హైడ్రేషన్ అంటే ఏమిటి?

ఒక వ్యక్తి తనకు అవసరమైన దానికంటే ఎక్కువ నీరు త్రాగినప్పుడు లేదా శరీరం అవసరమైన దానికంటే ఎక్కువ నీటిని నిలుపుకున్నప్పుడు, ఆ పరిస్థితిని ఓవర్‌హైడ్రేషన్ అంటారు. దీని తీవ్రమైన రూపమే నీటి మత్తు లేదా నీటి విషప్రయోగం.

ప్రమాదకర కారణాలు:

  • రక్తంలో సోడియం స్థాయి చాలా తక్కువగా పడిపోతుంది.
  • శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లు అసమతుల్యమవుతాయి.

కణాలు నీటితో నిండి ఉబ్బిపోతాయి. తీవ్రమైన సందర్భాల్లో మెదడు వాపు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ప్రాణాంతకం కావచ్చు. సమతుల్య పరిమాణంలో నీరు త్రాగడం ఎంత ముఖ్యమో, మితిమీరకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం.

కాలేయ సమస్యలు ఉన్నవారికి ముప్పు

సాధారణంగా ఆరోగ్యవంతమైన వ్యక్తులలో మూత్రపిండాలు నీటిని ఫిల్టర్ చేస్తాయి కాబట్టి అధిక నీరు కాలేయానికి నేరుగా హాని కలిగించదు. అయితే ఒక వ్యక్తికి ఇప్పటికే కాలేయ వ్యాధి, సిర్రోసిస్ ఉన్నట్లయితే, అధిక నీటి వినియోగం పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.

  • దెబ్బతిన్న కాలేయం ప్రోటీన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
  • శరీరం లోపల ద్రవం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.
  • సోడియం స్థాయిలు మరింతగా తగ్గి, ఉదరం మరియు శరీరం లో వాపు పెరుగుతుంది.

ఇలాంటివారికి వైద్యులు నీటిని పెంచమని కాకుండా తగ్గించుకోమని తరచుగా సిఫార్సు చేస్తారు.

కలుషిత నీరు

మనం తాగే నీరు కలుషితమై ఉంటే దానిలోని కాలుష్య కారకాలు శరీరంలో పేరుకుపోయి కాలేయంపై ఒత్తిడిని పెంచుతాయి. ఇది కూడా ప్రమాదాన్ని పెంచుతుంది.

మీరు ఎక్కువగా నీరు తాగుతున్నారని మీ శరీరం తెలిపే కొన్ని నిర్దిష్ట సంకేతాలు ఇవి:

  • తరచుగా మూత్రవిసర్జన.
  • మూత్రం స్పష్టంగా ఉండటం.
  • తలనొప్పి – వికారం.
  • చేతులు – కాళ్ళలో వాపు.
  • అలసట – కండరాల తిమ్మిరి.

ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే నీరు తాగే పరిమాణాన్ని నియంత్రించడం మంచిది.

మీ శరీరానికి ఎంత నీరు సరైనది?

రోజుకు 8 గ్లాసుల నీరు త్రాగాలనే నియమం అందరికీ సరిపోదు. మీ శరీర నీటి అవసరాలు వయస్సు, సీజన్, కార్యాచరణ, ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. మీ మూత్రం లేత పసుపు రంగులో ఉండటం మంచి హైడ్రేషన్‌కు సరైన సంకేతం. మీ మూత్రం రంగును బట్టి మీ నీటి పరిమాణాన్ని నిర్ణయించుకోవడం ఉత్తమం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించిన రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించిన రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా